లిక్కర్ స్కామ్ కేసు.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

  • మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ
  • ఈ కేసులో 39వ నిందితుడిగా ఉన్న మోహిత్‌రెడ్డి
  • మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడే మోహిత్‌రెడ్డి
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి 39వ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేదు. వాదనలు విన్న అనంతరం మోహిత్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు నిర్ణయంతో మోహిత్‌రెడ్డికి ఈ కేసులో నిరాశే ఎదురైంది. 


More Telugu News