Chaithanyananda Swamy: చైతన్యానంద స్వామి లీలలు.. అమ్మాయిలతో చాటింగ్, ఫొటోలు.. మొబైల్ ఫోన్లో బయటపడ్డ బండారం!
- ఢిల్లీ ఆశ్రమంలో దొంగ బాబా లైంగిక వేధింపులు
- 50 రోజుల తర్వాత ఆగ్రాలో అరెస్ట్
- విద్యార్థినులను వేధించినట్టు 17 మంది ఫిర్యాదు
- బ్రిక్స్, ఐరాస రాయబారినంటూ నకిలీ కార్డులు
- విచారణకు సహకరించడం లేదన్న పోలీసులు
ఆశ్రమం పేరుతో డజనుకు పైగా యువతులను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథి బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. 50 రోజులుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అతనిని రెండు రోజుల క్రితం ఆగ్రాలోని ఓ హోటల్లో అరెస్ట్ చేయగా, దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
చైతన్యానంద మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అందులో ఉన్న సమాచారాన్ని చూసి నివ్వెరపోయారు. పలువురు యువతులకు రకరకాల ఆశలు చూపి లోబరుచుకునేందుకు ప్రయత్నించినట్టు వాట్సాప్ చాట్స్ ద్వారా గుర్తించారు. అంతేకాకుండా, పలువురు మహిళా క్యాబిన్ క్రూ సభ్యులతో దిగిన ఫొటోలు, ఎందరో అమ్మాయిల సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాలను స్క్రీన్షాట్లు తీసుకుని తన ఫోన్లో సేవ్ చేసుకున్నట్టు పోలీసులు కనుగొన్నారు. ఈ కేసులో ఇతడికి సహకరించిన ఇద్దరు మహిళా అనుచరులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వసంత్ కుంజ్లోని శ్రీ శారదా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్కు గతంలో డైరెక్టర్గా పనిచేసిన చైతన్యానందపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. యువతులతో అసభ్యంగా మాట్లాడటం, అసభ్యకర మెసేజ్లు పంపడం, బలవంతంగా తాకడం వంటివి చేసేవాడని బాధితులు ఫిర్యాదు చేశారు. మహిళల హాస్టల్లో రహస్యంగా కెమెరాలు కూడా అమర్చినట్టు ఆరోపణలు ఉన్నాయి.
పోలీసుల విచారణకు ఈ దొంగ బాబా ఏమాత్రం సహకరించడం లేదని, అడిగిన ప్రశ్నలకు అబద్ధాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని అధికారులు తెలిపారు. తిరుగులేని ఆధారాలు చూపించినప్పుడు మాత్రమే నోరు విప్పుతున్నాడని, తన చర్యల పట్ల అతడిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని వెల్లడించారు.
లైంగిక వేధింపులే కాకుండా, చైతన్యానంద పలు మోసాలకు కూడా పాల్పడినట్టు తేలింది. తాను ఐక్యరాజ్యసమితి (యూఎన్), బ్రిక్స్ దేశాలకు రాయబారినంటూ నకిలీ విజిటింగ్ కార్డులు సృష్టించుకుని తిరిగేవాడని పోలీసులు తెలిపారు. ఇతడిపై చర్యలు తీసుకోవాలని బాధితుల్లో ఒకరి తండ్రి ప్రయత్నించగా, స్వామి అనుచరుడైన హరి సింగ్ కోప్కోటి అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడిని కూడా అరెస్ట్ చేశారు. పేద వర్గాలకు చెందిన సుమారు 17 మంది విద్యార్థినులు చైతన్యానంద తమను వేధించాడని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఇనిస్టిట్యూట్ యాజమాన్యం అతడిని విధుల నుంచి తొలగించింది.
చైతన్యానంద మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అందులో ఉన్న సమాచారాన్ని చూసి నివ్వెరపోయారు. పలువురు యువతులకు రకరకాల ఆశలు చూపి లోబరుచుకునేందుకు ప్రయత్నించినట్టు వాట్సాప్ చాట్స్ ద్వారా గుర్తించారు. అంతేకాకుండా, పలువురు మహిళా క్యాబిన్ క్రూ సభ్యులతో దిగిన ఫొటోలు, ఎందరో అమ్మాయిల సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాలను స్క్రీన్షాట్లు తీసుకుని తన ఫోన్లో సేవ్ చేసుకున్నట్టు పోలీసులు కనుగొన్నారు. ఈ కేసులో ఇతడికి సహకరించిన ఇద్దరు మహిళా అనుచరులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వసంత్ కుంజ్లోని శ్రీ శారదా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్కు గతంలో డైరెక్టర్గా పనిచేసిన చైతన్యానందపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. యువతులతో అసభ్యంగా మాట్లాడటం, అసభ్యకర మెసేజ్లు పంపడం, బలవంతంగా తాకడం వంటివి చేసేవాడని బాధితులు ఫిర్యాదు చేశారు. మహిళల హాస్టల్లో రహస్యంగా కెమెరాలు కూడా అమర్చినట్టు ఆరోపణలు ఉన్నాయి.
పోలీసుల విచారణకు ఈ దొంగ బాబా ఏమాత్రం సహకరించడం లేదని, అడిగిన ప్రశ్నలకు అబద్ధాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని అధికారులు తెలిపారు. తిరుగులేని ఆధారాలు చూపించినప్పుడు మాత్రమే నోరు విప్పుతున్నాడని, తన చర్యల పట్ల అతడిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని వెల్లడించారు.
లైంగిక వేధింపులే కాకుండా, చైతన్యానంద పలు మోసాలకు కూడా పాల్పడినట్టు తేలింది. తాను ఐక్యరాజ్యసమితి (యూఎన్), బ్రిక్స్ దేశాలకు రాయబారినంటూ నకిలీ విజిటింగ్ కార్డులు సృష్టించుకుని తిరిగేవాడని పోలీసులు తెలిపారు. ఇతడిపై చర్యలు తీసుకోవాలని బాధితుల్లో ఒకరి తండ్రి ప్రయత్నించగా, స్వామి అనుచరుడైన హరి సింగ్ కోప్కోటి అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడిని కూడా అరెస్ట్ చేశారు. పేద వర్గాలకు చెందిన సుమారు 17 మంది విద్యార్థినులు చైతన్యానంద తమను వేధించాడని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఇనిస్టిట్యూట్ యాజమాన్యం అతడిని విధుల నుంచి తొలగించింది.