Narendra Modi: ఇటలీ ప్రధాని మెలోనీ పుస్తకానికి 'ముందుమాట' రాసిన ప్రధాని మోదీ
- ఇటలీ ప్రధాని మెలోనీ ఆత్మకథ
- 'ఐ యామ్ జార్జియా - మై రూట్స్, మై ప్రిన్సిపుల్స్' పేరుతో విడుదల కానున్న పుస్తకం
- మెలోనీపై మోదీ ప్రశంసల వర్షం
భారత్, ఇటలీ దేశాల మధ్య బలపడుతున్న స్నేహ బంధానికి, ఇరు దేశాల ప్రధానుల మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధానికి నిదర్శనంగా ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ రాసిన ఆత్మకథకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా 'ముందుమాట' రాశారు. అంతేకాదు, 'ఆలోచనలను, హృదయాన్ని ఏకం చేసే అసాధారణ రాజకీయ నాయకురాలు' అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ పుస్తకాన్ని తన ప్రసిద్ధ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' (హృదయంలోని ఆలోచనలు)తో పోల్చి అరుదైన గౌరవాన్ని అందించారు.
భారత్లో 'ఐ యామ్ జార్జియా - మై రూట్స్, మై ప్రిన్సిపుల్స్' పేరుతో విడుదల కానున్న ఈ పుస్తకానికి మోదీ రాసిన ముందుమాట వివరాలను ఇటలీకి చెందిన 'అడ్న్క్రోనోస్' వార్తా సంస్థ వెల్లడించింది. "సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ, సమాజ బలం, మహిళా శక్తిని గౌరవించడం వంటి అంశాలు రెండు దేశాల మధ్య ఉన్న బలమైన బంధానికి పునాదులు" అని మోదీ పేర్కొన్నట్లు తెలిపింది. ఈ పుస్తకం సమకాలీన రాజకీయ నాయకురాలిగా, దేశభక్తురాలిగా మెలోనీ స్ఫూర్తిదాయక గాథను వివరిస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు మోదీ అన్నారు.
ప్రధాని మోదీ తన పట్ల చూపిన ఆదరణపై జార్జియా మెలోనీ స్పందించారు. "ప్రధాని నరేంద్ర మోదీ మాటలు నన్ను ఎంతగానో గౌరవించాయి, నా హృదయాన్ని తాకాయి. ఆయన పట్ల నాకూ అంతే ప్రగాఢమైన గౌరవం ఉంది. ఈ భావాలను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది మన దేశాల మధ్య ఉన్న బలమైన బంధానికి నిదర్శనం" అని ఆమె చెప్పినట్లు ఇటలీ మీడియా పేర్కొంది.
ప్రధాని మోదీ ఒక పుస్తకానికి ముందుమాట రాయడం చాలా అరుదని, ఇది కేవలం మూడోసారి మాత్రమేనని ఇటలీ మీడియా విశ్లేషించింది. గతంలో 2014లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్, 2017లో ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు హేమమాలిని ఆత్మకథలకు మాత్రమే ఆయన ముందుమాట రాశారు. కాప్28 సదస్సులో మోదీ, మెలోనీ కలిసి తీసుకున్న సెల్ఫీ తర్వాత సోషల్ మీడియాలో '#మెలోడీ' అనే హ్యాష్ట్యాగ్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజా పరిణామం వారి మధ్య ఉన్న స్నేహపూర్వక, రాజకీయ సంబంధాన్ని మరింత స్పష్టం చేస్తోంది.
భారత్లో 'ఐ యామ్ జార్జియా - మై రూట్స్, మై ప్రిన్సిపుల్స్' పేరుతో విడుదల కానున్న ఈ పుస్తకానికి మోదీ రాసిన ముందుమాట వివరాలను ఇటలీకి చెందిన 'అడ్న్క్రోనోస్' వార్తా సంస్థ వెల్లడించింది. "సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ, సమాజ బలం, మహిళా శక్తిని గౌరవించడం వంటి అంశాలు రెండు దేశాల మధ్య ఉన్న బలమైన బంధానికి పునాదులు" అని మోదీ పేర్కొన్నట్లు తెలిపింది. ఈ పుస్తకం సమకాలీన రాజకీయ నాయకురాలిగా, దేశభక్తురాలిగా మెలోనీ స్ఫూర్తిదాయక గాథను వివరిస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు మోదీ అన్నారు.
ప్రధాని మోదీ తన పట్ల చూపిన ఆదరణపై జార్జియా మెలోనీ స్పందించారు. "ప్రధాని నరేంద్ర మోదీ మాటలు నన్ను ఎంతగానో గౌరవించాయి, నా హృదయాన్ని తాకాయి. ఆయన పట్ల నాకూ అంతే ప్రగాఢమైన గౌరవం ఉంది. ఈ భావాలను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది మన దేశాల మధ్య ఉన్న బలమైన బంధానికి నిదర్శనం" అని ఆమె చెప్పినట్లు ఇటలీ మీడియా పేర్కొంది.
ప్రధాని మోదీ ఒక పుస్తకానికి ముందుమాట రాయడం చాలా అరుదని, ఇది కేవలం మూడోసారి మాత్రమేనని ఇటలీ మీడియా విశ్లేషించింది. గతంలో 2014లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్, 2017లో ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు హేమమాలిని ఆత్మకథలకు మాత్రమే ఆయన ముందుమాట రాశారు. కాప్28 సదస్సులో మోదీ, మెలోనీ కలిసి తీసుకున్న సెల్ఫీ తర్వాత సోషల్ మీడియాలో '#మెలోడీ' అనే హ్యాష్ట్యాగ్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజా పరిణామం వారి మధ్య ఉన్న స్నేహపూర్వక, రాజకీయ సంబంధాన్ని మరింత స్పష్టం చేస్తోంది.