Rani Kumudini: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు మోగిన నగారా.. షెడ్యూల్ పూర్తి వివరాలు ఇవిగో!
- అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
- మొత్తం ఐదు దశల్లో పోలింగ్ నిర్వహణ
- మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ.. తర్వాత మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు
రాష్ట్రంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి తెరలేచింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల పూర్తి షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎన్నికల కోడ్) తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఆమె స్పష్టం చేశారు. మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
విడుదలైన షెడ్యూల్ ప్రకారం, అక్టోబర్ 9వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందుగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. అక్టోబర్ 23న తొలి విడత, అక్టోబర్ 27న రెండో విడత పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల కమిషనర్ వివరించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అనంతరం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నట్లు రాణి కుముదిని తెలిపారు. తొలి విడతకు అక్టోబర్ 31న పోలింగ్ జరుపుతారు. ఇక రెండో విడతకు నవంబర్ 4న పోలింగ్ నిర్వహిస్తారు. మూడో విడతకు నవంబర్ 8న పోలింగ్ పూర్తి చేస్తామని ఆమె వెల్లడించారు.
సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తామని కమిషనర్ తెలిపారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 555 మండలాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతాయని, మొత్తం 5749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం 1.12 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్లను కూడా ఆదివారం సాయంత్రమే విడుదల చేశామని ఆమె వెల్లడించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు- తొలివిడత
విడుదలైన షెడ్యూల్ ప్రకారం, అక్టోబర్ 9వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందుగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. అక్టోబర్ 23న తొలి విడత, అక్టోబర్ 27న రెండో విడత పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల కమిషనర్ వివరించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అనంతరం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నట్లు రాణి కుముదిని తెలిపారు. తొలి విడతకు అక్టోబర్ 31న పోలింగ్ జరుపుతారు. ఇక రెండో విడతకు నవంబర్ 4న పోలింగ్ నిర్వహిస్తారు. మూడో విడతకు నవంబర్ 8న పోలింగ్ పూర్తి చేస్తామని ఆమె వెల్లడించారు.
సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తామని కమిషనర్ తెలిపారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 555 మండలాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతాయని, మొత్తం 5749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం 1.12 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్లను కూడా ఆదివారం సాయంత్రమే విడుదల చేశామని ఆమె వెల్లడించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు- తొలివిడత
- నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 9
- స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 11
- పరిశీలన: అక్టోబర్ 12
- నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 15
- ఎన్నికల తేదీ- అక్టోబర్ 23
- ఓట్ల లెక్కింపు- నవంబర్ 11
- నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 13
- స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 15
- పరిశీలన: అక్టోబర్ 16
- నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 19
- ఎన్నికల తేదీ- అక్టోబర్ 27
- ఓట్ల లెక్కింపు- నవంబర్ 11
- నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 17
- స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 19
- పరిశీలన: అక్టోబర్ 20
- నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 23
- ఎన్నికల తేదీ, ఫలితాలు- అక్టోబర్ 31
- నామినేషన్ల స్వీకరణ- అక్టోబర్ 21
- చివరి తేదీ: అక్టోబర్ 23
- పరిశీలన: అక్టోబర్ 24
- నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 27
- ఎన్నికల తేదీ, ఫలితాలు- నవంబర్ 4
- నామినేషన్ల స్వీకరణ- అక్టోబర్ 25
- చివరి తేదీ: అక్టోబర్ 27
- పరిశీలన: అక్టోబర్ 28
- నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 31
- ఎన్నికల తేదీ, ఫలితాలు- నవంబర్ 8.