Whiskey Sales: దేశంలోని విస్కీ అమ్మకాల లెక్కలు విడుదల.. ఏపీ, తెలంగాణలో ఎంత అమ్ముడయ్యాయంటే..!
- దేశంలో విస్కీ అమ్మకాల్లో దక్షిణాది హవా
- మొత్తం అమ్మకాల్లో 58 శాతం వాటా దక్షిణ భారతదేశానిదే
- దేశంలోనే అమ్మకాల్లో కర్ణాటక టాప్
- తెలంగాణలో 3.71 కోట్లు, ఏపీలో 3.55 కోట్ల కేసుల అమ్మకాలు
- ఉత్తర భారతదేశం వాటా కేవలం 20 శాతానికే పరిమితం
- గతేడాదితో పోలిస్తే దేశవ్యాప్తంగా పెరిగిన అమ్మకాలు
భారతదేశంలో మద్యం వినియోగం అనగానే అందరి దృష్టి దక్షిణాది రాష్ట్రాల వైపే మళ్లుతోంది. అందులోనూ దక్షిణ భారతదేశంలో ప్రజలు విస్కీని ఎడాపెడా తాగేస్తున్నారు. దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్)లో ఏకంగా సగానికి పైగా వాటా మన దక్షిణాది రాష్ట్రాలదే కావడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్ (సీఐఏబీసీ) తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం ఐఎంఎఫ్ఎల్ అమ్మకాలలో 58 శాతం వాటాను ఒక్క దక్షిణ భారతదేశమే కైవసం చేసుకుంది. ఈ ప్రాంతంలో మొత్తం 23.18 కోట్ల మద్యం కేసులు అమ్ముడైనట్లు సీఐఏబీసీ వెల్లడించింది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, తెలంగాణలో 3.71 కోట్ల కేసులు, ఆంధ్రప్రదేశ్లో 3.55 కోట్ల మద్యం కేసులు అమ్ముడయ్యాయి. ఈ రెండు రాష్ట్రాల అమ్మకాలు కలిపి దేశవ్యాప్త వాటాలో దాదాపు 9 శాతంగా నమోదయ్యాయి. కాగా, దేశంలోనే అత్యధికంగా 17 శాతం వాటాతో కర్ణాటక అగ్రస్థానంలో నిలిచింది.
దక్షిణాదితో పోలిస్తే ఉత్తర భారతదేశం వాటా చాలా తక్కువగా, కేవలం 20 శాతానికే పరిమితమైంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ 2.50 కోట్ల కేసుల అమ్మకాలతో ముందంజలో ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే యూపీ ఆరో స్థానంలో నిలవగా, రాజస్థాన్ (9వ స్థానం), ఢిల్లీ (10వ స్థానం), హరియాణా (11వ స్థానం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
గత ఆర్థిక సంవత్సరంలో (ఎఫ్వై-24) దేశవ్యాప్తంగా 39.62 కోట్ల ఐఎంఎఫ్ఎల్ కేసులు అమ్ముడవగా, ఈ ఆర్థిక సంవత్సరంలో (ఎఫ్వై-25) ఆ సంఖ్య 40.17 కోట్లకు చేరిందని సీఐఏబీసీ డైరెక్టర్ జనరల్ అనంత ఎస్ అయ్యార్ తెలిపారు. మొత్తం మీద చూస్తే, గత ఏడాదితో పోలిస్తే దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాల్లో స్వల్ప వృద్ధి నమోదైంది.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్ (సీఐఏబీసీ) తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం ఐఎంఎఫ్ఎల్ అమ్మకాలలో 58 శాతం వాటాను ఒక్క దక్షిణ భారతదేశమే కైవసం చేసుకుంది. ఈ ప్రాంతంలో మొత్తం 23.18 కోట్ల మద్యం కేసులు అమ్ముడైనట్లు సీఐఏబీసీ వెల్లడించింది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, తెలంగాణలో 3.71 కోట్ల కేసులు, ఆంధ్రప్రదేశ్లో 3.55 కోట్ల మద్యం కేసులు అమ్ముడయ్యాయి. ఈ రెండు రాష్ట్రాల అమ్మకాలు కలిపి దేశవ్యాప్త వాటాలో దాదాపు 9 శాతంగా నమోదయ్యాయి. కాగా, దేశంలోనే అత్యధికంగా 17 శాతం వాటాతో కర్ణాటక అగ్రస్థానంలో నిలిచింది.
దక్షిణాదితో పోలిస్తే ఉత్తర భారతదేశం వాటా చాలా తక్కువగా, కేవలం 20 శాతానికే పరిమితమైంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ 2.50 కోట్ల కేసుల అమ్మకాలతో ముందంజలో ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే యూపీ ఆరో స్థానంలో నిలవగా, రాజస్థాన్ (9వ స్థానం), ఢిల్లీ (10వ స్థానం), హరియాణా (11వ స్థానం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
గత ఆర్థిక సంవత్సరంలో (ఎఫ్వై-24) దేశవ్యాప్తంగా 39.62 కోట్ల ఐఎంఎఫ్ఎల్ కేసులు అమ్ముడవగా, ఈ ఆర్థిక సంవత్సరంలో (ఎఫ్వై-25) ఆ సంఖ్య 40.17 కోట్లకు చేరిందని సీఐఏబీసీ డైరెక్టర్ జనరల్ అనంత ఎస్ అయ్యార్ తెలిపారు. మొత్తం మీద చూస్తే, గత ఏడాదితో పోలిస్తే దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాల్లో స్వల్ప వృద్ధి నమోదైంది.