తల్లిదండ్రులను వేధిస్తున్న బిడ్డలకు బుద్ధిచెప్పే తాతల సంఘం
- ఫిర్యాదు అందుకున్నాక తొలుత మంచి మాటలతో సర్దిచెప్పే ప్రయత్నం
- అప్పటికీ వినకుంటే ఇంటి ముందు వంట చేసుకుని తింటూ నిరసన
- కామారెడ్డి జిల్లా మోతె గ్రామంలో వృద్ధుల సంఘం
ఎలా ఏర్పడిందంటే..
మోతె గ్రామంలో గతంలో పలువురు వృద్ధులు తమ పిల్లలు సరిగా చూడటం లేదని, మాటలతో వేధిస్తున్నారని సర్పంచ్ కు ఫిర్యాదు చేస్తుండేవారు. సర్పంచ్ మందలింపుతో తాత్కాలికంగా సమస్య సద్దుమణిగినా కొన్ని రోజుల తర్వాత పునరావృతమయ్యేది. దీంతో గ్రామంలో వృద్ధులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో 2010లో అప్పటి సర్పంచ్ గడ్డం రాజిరెడ్డి ఈ తాతల సంఘాన్ని ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఈ సంఘానికి ఒక భవనాన్ని నిర్మించి ఇచ్చారు. ప్రస్తుతం ఈ సంఘంలో 40 మంది వృద్ధులు సభ్యులుగా ఉన్నారు.