శ్రీవారి భక్తులకు తిరుమలలో అత్యాధునిక వసతి సదుపాయం పీఏసీ–5
- తిరుమలలో యాత్రికుల వసతి సముదాయాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి, ఏపీ సీఎం
- బుకింగ్ లేకున్నా ఒకేసారి 4 వేల మంది భక్తులకు వసతి
- 16 డార్మిటరీలు, 2,400 లాకర్లు, 24 గంటలూ వేడి నీటి సదుపాయం
ఒకేసారి 4 వేల మందికి వసతి..
వేంకటాద్రి వసతి సముదాయంలో ఒకేసారి 4 వేల మందికి వసతి సౌకర్యం కల్పించవచ్చు. ఇందులో 16 డార్మిటరీలు, 2,400 లాకర్లు, ఒకేసారి 1400 మంది భోజనం చేసేందుకు వీలుగా రెండు డైనింగ్ హాళ్లు ఉన్నాయి. భక్తులకు 24 గంటలూ వేడి నీటి సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఒకేసారి 80 మంది తలనీలాలు సమర్పించేందుకు అనువుగా ప్రాంగణంలో కల్యాణకట్టను ఏర్పాటు చేశారు.