జమ్మూకశ్మీర్‌లో భీకర ఎన్‌కౌంటర్.. సైనికుడికి గాయాలు.. ఉగ్రవాదుల దిగ్బంధం

Udhampur Encounter Soldier Injured and Jaish Terrorists Trapped
షార్ట్స్‌లో చూడండి
జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. ఉధంపూర్ జిల్లాలో శుక్రవారం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురి నుంచి నలుగురు ఉగ్రవాదులను సైన్యం చుట్టుముట్టినట్లు అధికారులు వెల్లడించారు. కాల్పుల సమయంలో ఓ ఆర్మీ జవానుకు గాయాలయ్యాయి.

దోడా-ఉధంపూర్ సరిహద్దులోని దూదు బసంత్‌గఢ్ ఎత్తైన అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆర్మీ, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG), పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. భద్రతా బలగాలు వెంటనే స్పందించి ఉగ్రవాదులను దిగ్బంధించాయి.

ఈ ఆపరేషన్‌లో చిక్కుకున్న ఉగ్రవాదులు నిషేధిత జైషే మహ్మద్ (జేఈఎం) సంస్థకు చెందినవారై ఉంటారని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. "దోడా-ఉధంపూర్ సరిహద్దులో ఉగ్రవాదుల కదలికలు గుర్తించాం. ఆపరేషన్ కొనసాగుతోంది" అని వైట్ నైట్ కార్ప్స్ 'ఎక్స్'వేదికగా ప్రకటించింది. ఎన్‌కౌంటర్ జరుగుతున్న విషయాన్ని జమ్మూ ఐజీపీ కూడా ధ్రువీకరించారు.

ప్రారంభంలో కిష్త్వార్ జిల్లాలో కూడా మరో ఎన్‌కౌంటర్ జరుగుతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఆపరేషన్ కేవలం ఉధంపూర్ జిల్లాకే పరిమితమైందని సైన్యం స్పష్టత నిచ్చింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. గాయపడిన సైనికుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
Go Back to Shorts
Udhampur Encounter
Jammu Kashmir
Jaish e Mohammed
Terrorists Trapped
Indian Army
Doda Udhampur
White Knight Corps
SOG
Udhampur Terrorist Attack

More Telugu News