Sasikala: శశికళ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు... చెన్నై, హైదరాబాద్‌లలో ఈడీ తనిఖీలు

Sasikala Surrounded ED Searches in Chennai Hyderabad
  • శశికళ బినామీ ఆస్తుల కేసులో ఈడీ సోదాలు
  • చెన్నై, హైదరాబాద్‌లలో ఏకకాలంలో దాడులు
  • రూ. 200 కోట్ల బ్యాంకు మోసంపై మనీలాండరింగ్ విచారణ
  • మార్గ్‌ గ్రూప్‌తో సంబంధమున్న జీఆర్‌కే రెడ్డి ఇళ్లలో తనిఖీలు
  • శశికళకు జీఆర్‌కే రెడ్డి బినామీగా ఉన్నారన్న ఆరోపణలు
  • సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ దర్యాప్తు
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వి.కె. శశికళకు సంబంధించిన బినామీ ఆస్తులు, మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. రూ. 200 కోట్ల భారీ బ్యాంకు మోసం ఆరోపణలకు సంబంధించి చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఈడీ అధికారులు గురువారం మెరుపుదాడులు నిర్వహించారు.

శశికళకు బినామీగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్గ్‌ గ్రూప్‌నకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జీఆర్‌కే రెడ్డి లక్ష్యంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో ఆయనకు చెందిన సుమారు పది కార్యాలయాలు, నివాసాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల కింద ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సుమారు రూ. 200 కోట్ల బ్యాంకు రుణాలను మోసపూరితంగా పొందిన కేసులో గతంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా, నిధుల మళ్లింపు జరిగిందన్న అనుమానాలతో ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో శశికళతో పాటు మరికొందరి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Sasikala
Sasikala ED raids
GRK Reddy
Enforcement Directorate
Money laundering case
Chennai ED searches

More Telugu News