Upastha Gill: నేను బస చేసిన హోటల్ను తగలబెట్టారు.. నన్ను వెంబడించారు.. నేపాల్ వెళ్లిన భారతీయురాలి ఆవేదన
- నేపాల్లో తీవ్రమైన ‘జెన్ జడ్’ నిరసనలు
- పలుచోట్ల హింసాత్మక ఘటనలు
- పోఖారాలో చిక్కుకున్నానన్న భారతీయురాలు
- సాయం చేయాలంటూ భారత ప్రభుత్వానికి వేడుకోలు
నేపాల్లో కొనసాగుతున్న ‘జెన్ జడ్’ నిరసనలు హింసాత్మకంగా మారడంతో అక్కడి పరిస్థితి అదుపుతప్పింది. ఈ ఆందోళనల మధ్య పోఖారాలో చిక్కుకుపోయిన ఓ భారతీయ మహిళ, తనను కాపాడాలంటూ భారత ప్రభుత్వానికి వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. తాను బస చేసిన హోటల్కు ఆందోళనకారులు నిప్పంటించారని, కర్రలతో తనను వెంబడించారని ఆవేదన వ్యక్తం చేశారు.
వాలీబాల్ లీగ్ నిర్వహణ కోసం నేపాల్ వెళ్లిన ఉపాస్థ గిల్ అనే భారతీయ మహిళ పోఖారాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. "నేను ఉపాస్థ గిల్. దయచేసి భారత రాయబార కార్యాలయం మమ్మల్ని ఆదుకోవాలి. నేను స్పాలో ఉన్నప్పుడు నిరసనకారులు నేనున్న హోటల్కు నిప్పుపెట్టారు. నా లగేజీ, వస్తువులన్నీ కాలిపోయాయి. పెద్ద పెద్ద కర్రలతో నా వెనకాల పడ్డారు. అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడ్డాను" అని ఆమె తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.
నేపాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, రోడ్లపై ఎక్కడ చూసినా మంటలు పెడుతున్నారని ఆమె వివరించారు. "ఇక్కడ పర్యాటకులను కూడా వదలడం లేదు. మేమంతా మరో హోటల్లో తలదాచుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని కాపాడండి" అని ఆమె చేతులు జోడించి వేడుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, భారత ప్రభుత్వం వెంటనే స్పందించింది.
భారతీయులకు కేంద్రం కీలక సూచనలు
నేపాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. పరిస్థితి చక్కబడే వరకు నేపాల్కు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం నేపాల్లో ఉన్న భారతీయులు ఇళ్లకే పరిమితం కావాలని, బయటకు రావద్దని హెచ్చరించింది. స్థానిక అధికారుల భద్రతా సూచనలను పాటించాలని కోరింది. ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం అత్యవసర సహాయం కోసం రెండు హెల్ప్లైన్ నంబర్లను (977-9808602881, 977-9810326134) అందుబాటులోకి తెచ్చింది.
వెనక్కి వస్తున్న భారత పర్యాటకులు
నేపాల్లో నెలకొన్న అశాంతి కారణంగా పశుపతినాథ్ ఆలయ సందర్శనకు వెళ్లిన అనేక మంది భారత పర్యాటకులు తమ పర్యటనలను అర్ధాంతరంగా ముగించుకుని స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని సోనౌలీ సరిహద్దు వద్ద భారతీయుల రద్దీ పెరిగింది. విమానాలు రద్దు కావడంతో చాలామంది రాత్రంతా లాడ్జీలలో ఉండి, వెనక్కి వస్తున్నామని తెలిపారు. మరోవైపు, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేయగా, అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ శాంతియుత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని నిరసనకారులను కోరారు.
వాలీబాల్ లీగ్ నిర్వహణ కోసం నేపాల్ వెళ్లిన ఉపాస్థ గిల్ అనే భారతీయ మహిళ పోఖారాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. "నేను ఉపాస్థ గిల్. దయచేసి భారత రాయబార కార్యాలయం మమ్మల్ని ఆదుకోవాలి. నేను స్పాలో ఉన్నప్పుడు నిరసనకారులు నేనున్న హోటల్కు నిప్పుపెట్టారు. నా లగేజీ, వస్తువులన్నీ కాలిపోయాయి. పెద్ద పెద్ద కర్రలతో నా వెనకాల పడ్డారు. అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడ్డాను" అని ఆమె తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.
నేపాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, రోడ్లపై ఎక్కడ చూసినా మంటలు పెడుతున్నారని ఆమె వివరించారు. "ఇక్కడ పర్యాటకులను కూడా వదలడం లేదు. మేమంతా మరో హోటల్లో తలదాచుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని కాపాడండి" అని ఆమె చేతులు జోడించి వేడుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, భారత ప్రభుత్వం వెంటనే స్పందించింది.
భారతీయులకు కేంద్రం కీలక సూచనలు
నేపాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. పరిస్థితి చక్కబడే వరకు నేపాల్కు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం నేపాల్లో ఉన్న భారతీయులు ఇళ్లకే పరిమితం కావాలని, బయటకు రావద్దని హెచ్చరించింది. స్థానిక అధికారుల భద్రతా సూచనలను పాటించాలని కోరింది. ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం అత్యవసర సహాయం కోసం రెండు హెల్ప్లైన్ నంబర్లను (977-9808602881, 977-9810326134) అందుబాటులోకి తెచ్చింది.
వెనక్కి వస్తున్న భారత పర్యాటకులు
నేపాల్లో నెలకొన్న అశాంతి కారణంగా పశుపతినాథ్ ఆలయ సందర్శనకు వెళ్లిన అనేక మంది భారత పర్యాటకులు తమ పర్యటనలను అర్ధాంతరంగా ముగించుకుని స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని సోనౌలీ సరిహద్దు వద్ద భారతీయుల రద్దీ పెరిగింది. విమానాలు రద్దు కావడంతో చాలామంది రాత్రంతా లాడ్జీలలో ఉండి, వెనక్కి వస్తున్నామని తెలిపారు. మరోవైపు, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేయగా, అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ శాంతియుత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని నిరసనకారులను కోరారు.