: బస్సులో ఫోన్ కొట్టేశారు.. యాప్తో రూ.6.15 లక్షలు కాజేశారు!
- బోయినపల్లి బస్టాప్లో ప్రయాణికుడి ఫోన్ చోరీ
- రెండు బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు బదిలీ
- కొత్త సిమ్ వాడటంలో ఆలస్యమే కారణమన్న పోలీసులు
- బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు, దర్యాప్తు
ఆర్టీసీ బస్సులో పోయిన సెల్ఫోన్ ఓ ప్రయాణికుడికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఫోన్తో పాటు ఏకంగా రూ.6.15 లక్షలు తన బ్యాంకు ఖాతా నుంచి మాయం కావడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. ఈ ఘటన హైదరాబాద్లోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన ఎం. ప్రసాదరావు ఈ నెల 2న ఉదయం బోయినపల్లి బస్టాప్లో నాందేడ్ వెళ్లే బస్సు ఎక్కారు. కాసేపటికే తన ఫోన్ కనిపించడం లేదని గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఆయన బోధన్ చేరుకున్నాక పాత నంబర్ను బ్లాక్ చేయించి, అదే నంబర్పై కొత్త సిమ్కార్డు తీసుకున్నారు. అయితే కొత్త ఫోన్ లేకపోవడంతో ఆ సిమ్ను వెంటనే ఉపయోగించలేదు.
ఇదే అదనుగా భావించిన దొంగ పాత ఫోన్లోని ఫోన్పే యాప్ను ఉపయోగించి ప్రసాదరావుకు చెందిన కెనరా బ్యాంకు ఖాతా నుంచి రూ. 4 లక్షలు, మరో సేవింగ్స్ ఖాతా నుంచి రూ. 2.15 లక్షల చొప్పున మొత్తం రూ. 6.15 లక్షలు బదిలీ చేసుకున్నాడు. ఈ నెల 6వ తేదీన ప్రసాదరావు కొత్త ఫోన్ కొనుగోలు చేసి, అందులో తన సిమ్ వేయగా అసలు విషయం బయటపడింది. తన ఖాతాల నుంచి భారీగా డబ్బు డ్రా అయినట్టు వచ్చిన మెసేజ్లు చూసి ఆయన నివ్వెరపోయాడు.
వెంటనే తేరుకుని నిన్న బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు కొత్త సిమ్ తీసుకున్నప్పటికీ, దాన్ని వెంటనే వినియోగంలోకి తీసుకురాకపోవడం వల్లే నిందితుడికి లావాదేవీలు జరిపేందుకు సమయం దొరికిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన ఎం. ప్రసాదరావు ఈ నెల 2న ఉదయం బోయినపల్లి బస్టాప్లో నాందేడ్ వెళ్లే బస్సు ఎక్కారు. కాసేపటికే తన ఫోన్ కనిపించడం లేదని గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఆయన బోధన్ చేరుకున్నాక పాత నంబర్ను బ్లాక్ చేయించి, అదే నంబర్పై కొత్త సిమ్కార్డు తీసుకున్నారు. అయితే కొత్త ఫోన్ లేకపోవడంతో ఆ సిమ్ను వెంటనే ఉపయోగించలేదు.
ఇదే అదనుగా భావించిన దొంగ పాత ఫోన్లోని ఫోన్పే యాప్ను ఉపయోగించి ప్రసాదరావుకు చెందిన కెనరా బ్యాంకు ఖాతా నుంచి రూ. 4 లక్షలు, మరో సేవింగ్స్ ఖాతా నుంచి రూ. 2.15 లక్షల చొప్పున మొత్తం రూ. 6.15 లక్షలు బదిలీ చేసుకున్నాడు. ఈ నెల 6వ తేదీన ప్రసాదరావు కొత్త ఫోన్ కొనుగోలు చేసి, అందులో తన సిమ్ వేయగా అసలు విషయం బయటపడింది. తన ఖాతాల నుంచి భారీగా డబ్బు డ్రా అయినట్టు వచ్చిన మెసేజ్లు చూసి ఆయన నివ్వెరపోయాడు.
వెంటనే తేరుకుని నిన్న బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు కొత్త సిమ్ తీసుకున్నప్పటికీ, దాన్ని వెంటనే వినియోగంలోకి తీసుకురాకపోవడం వల్లే నిందితుడికి లావాదేవీలు జరిపేందుకు సమయం దొరికిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.