Asia Cup 2025: నేటి నుంచి ఆసియా కప్ సందడి.. ఈసారి టోర్నీ విజేతకు భారీ ప్రైజ్‌మనీ

Asia Cup 2025 Tournament Begins Today
షార్ట్స్‌లో చూడండి
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2025 సందడి మొదలైంది. టీ20 ప్రపంచకప్ ముందు జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్, ఈ రోజు నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా మరోసారి టైటిల్‌పై కన్నేసింది.

ఈ పొట్టి ఫార్మాట్ టోర్నీలో మొత్తం ఎనిమిది ఆసియా జట్లు పాల్గొంటున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌తో పాటు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, యూఏఈ, ఒమన్ జట్లు ఉన్నాయి. ఇక గ్రూప్-బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘ‌నిస్థాన్‌, హాంకాంగ్ తలపడనున్నాయి.

టోర్నమెంట్‌లో భాగంగా నేడు అబుదాబి వేదికగా ఆఫ్ఘ‌నిస్థాన్‌, హాంకాంగ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను రేపు యూఏఈతో ఆడనుంది. ఇక యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ హైవోల్టేజ్ మ్యాచ్ ఈ నెల‌ 14న జరగనుంది. భారత అభిమానులను దృష్టిలో ఉంచుకుని, దాదాపు అన్ని మ్యాచ్‌లను రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యేలా ఏసీసీ షెడ్యూల్ చేసింది. సెప్టెంబర్ 28న దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్‌తో ఈ టోర్నీ ముగియనుంది.

ఈసారి టోర్నీ విజేతకు భారీ ప్రైజ్‌మనీ ప్రకటించారు. గత ఎడిషన్‌తో పోల్చితే 50 శాతం పెంచి, విజేతకు సుమారు రూ.2.6 కోట్లు అందజేయనున్నారు. రన్నరప్‌కు రూ.1.3 కోట్లు బహుమతిగా ఇవ్వనున్నారు. ఈ టోర్నీ ప్రసార హక్కులను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ దక్కించుకోగా, డిజిటల్ స్ట్రీమింగ్ సోనీలివ్ యాప్, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దుబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, రింకూ సింగ్.
రిజర్వ్ ప్లేయర్లు: ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.
Go Back to Shorts
Asia Cup 2025
Suryakumar Yadav
India vs Pakistan
T20 World Cup
UAE
Indian Cricket Team
Cricket Tournament
Prize Money
Sony Sports Network
SonyLiv

More Telugu News