భారత టీ20 లీగ్లో ఫిక్సింగ్ కలకలం.. ఇన్స్టాగ్రామ్లో రూ. కోటి ఆఫర్!
- యూపీ టీ20 లీగ్ను కుదిపేస్తున్న ఫిక్సింగ్ ఆరోపణలు
- కాశీ రుద్రాస్ జట్టు మేనేజర్కు బుకీ నుంచి భారీ ఆఫర్
- ఇన్స్టాగ్రామ్ వేదికగా మ్యాచ్ ఫిక్సింగ్కు యత్నం
- మ్యాచ్కు కోటి రూపాయల వరకు ఇస్తామని ఎర
- రంగంలోకి దిగిన యాంటీ కరప్షన్ యూనిట్, ఎఫ్ఐఆర్ నమోదు
భారత క్రికెట్ను మ్యాచ్ ఫిక్సింగ్ భూతం మరోసారి పట్టి పీడిస్తోంది. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న యూపీ టీ20 లీగ్లో మ్యాచ్ ఫిక్సింగ్ కుట్ర జరిగిందన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. లీగ్లోని కాశీ రుద్రాస్ జట్టు మేనేజర్కు ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏకంగా కోటి రూపాయల వరకు ఆఫర్ చేసినట్లు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీయూ) రంగంలోకి దిగి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళితే.. కాశీ రుద్రాస్ జట్టు మేనేజర్గా ఉన్న అర్జున్ చౌహాన్ను '@vipss_nakrani' అనే ఇన్స్టాగ్రామ్ ఐడీ నుంచి ఓ వ్యక్తి సంప్రదించాడు. తాను ఒక బుకీనని పరిచయం చేసుకుని, మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేసేందుకు సహకరించాలని కోరాడు. తమకు అనుకూలంగా ఆటగాళ్ల ప్రదర్శనను మార్చగలిగితే ప్రతి మ్యాచ్కు రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు ఇస్తానని ఆశ చూపినట్టు సమాచారం. ఈ డబ్బును అమెరికన్ డాలర్లలో ఆన్లైన్ ద్వారా బదిలీ చేస్తానని నమ్మబలికాడు.
ఈ వ్యవహారంపై అప్రమత్తమైన జైపూర్ రీజనల్ ఏసీయూ ఇంటిగ్రిటీ మేనేజర్ హర్దయాల్ సింగ్ చంపావత్ వెంటనే లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. క్రికెట్లో అవినీతిని అరికట్టేందుకు పనిచేసే ఏసీయూ నేరుగా జోక్యం చేసుకోవడంతో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బీఎన్ఎస్, పబ్లిక్ గాంబ్లింగ్ యాక్ట్, ఐటీ యాక్ట్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇన్స్టాగ్రామ్ ఐడీ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు, ఈ ఫిక్సింగ్ కుట్ర వెనుక ఉన్న నెట్వర్క్ను ఛేదించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. స్థానిక ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ఏర్పాటు చేసిన ఇలాంటి లీగ్లలో ఫిక్సింగ్ ఆరోపణలు రావడం వాటి విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీస్తోందని క్రీడా విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. కాశీ రుద్రాస్ జట్టు మేనేజర్గా ఉన్న అర్జున్ చౌహాన్ను '@vipss_nakrani' అనే ఇన్స్టాగ్రామ్ ఐడీ నుంచి ఓ వ్యక్తి సంప్రదించాడు. తాను ఒక బుకీనని పరిచయం చేసుకుని, మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేసేందుకు సహకరించాలని కోరాడు. తమకు అనుకూలంగా ఆటగాళ్ల ప్రదర్శనను మార్చగలిగితే ప్రతి మ్యాచ్కు రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు ఇస్తానని ఆశ చూపినట్టు సమాచారం. ఈ డబ్బును అమెరికన్ డాలర్లలో ఆన్లైన్ ద్వారా బదిలీ చేస్తానని నమ్మబలికాడు.
ఈ వ్యవహారంపై అప్రమత్తమైన జైపూర్ రీజనల్ ఏసీయూ ఇంటిగ్రిటీ మేనేజర్ హర్దయాల్ సింగ్ చంపావత్ వెంటనే లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. క్రికెట్లో అవినీతిని అరికట్టేందుకు పనిచేసే ఏసీయూ నేరుగా జోక్యం చేసుకోవడంతో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బీఎన్ఎస్, పబ్లిక్ గాంబ్లింగ్ యాక్ట్, ఐటీ యాక్ట్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇన్స్టాగ్రామ్ ఐడీ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు, ఈ ఫిక్సింగ్ కుట్ర వెనుక ఉన్న నెట్వర్క్ను ఛేదించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. స్థానిక ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ఏర్పాటు చేసిన ఇలాంటి లీగ్లలో ఫిక్సింగ్ ఆరోపణలు రావడం వాటి విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీస్తోందని క్రీడా విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.