Neelam Sawhney: జనవరిలో స్థానిక పోరు.. ఏపీ ఎన్నికల సంఘం ఏర్పాట్లు
- వచ్చే ఏడాది ఏప్రిల్ లో ముగియనున్న సర్పంచ్ ల పదవీకాలం
- 3 నెలల ముందే ఎన్నికలు నిర్వహించే ఏర్పాట్లలో ఎస్ఈసీ
- పంచాయతీరాజ్శాఖ, పురపాలక కమిషనర్లకు ఇప్పటికే లేఖలు
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో సర్పంచ్ ల పదవీ కాలం, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం మార్చిలో ముగియనుండగా.. చట్టంలోని వెసులుబాట్ల మేరకు జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ మేరకు పురపాలక, పంచాయతీరాజ్ కమిషనర్లకు ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని బుధవారం లేఖలు రాశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
లేఖలో పేర్కొన్న షెడ్యూల్..
లేఖలో పేర్కొన్న షెడ్యూల్..
- అక్టోబరు 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి
- నవంబరు 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాల ప్రచురణ
- నవంబరు 1 నుంచి 15లోగా ఎన్నికల అధికారుల నియామకం
- నవంబరు 30లోగా పోలింగ్ కేంద్రాల ఖరారు, ఈవీఎంల ఏర్పాట్లు
- డిసెంబరు 15లోపు రిజర్వేషన్లు ఖరారు
- 2026 జనవరిలో నోటిఫికేషన్, ఎన్నికల నిర్వహణ, ఫలితాల ప్రకటన