Bigg Boss 9 Telugu: బిగ్ బాస్-9 కంటెస్టెంట్లు వీరేనా? .. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేర్లు
- సెప్టెంబర్ 7న ప్రారంభం కానున్న బిగ్బాస్ తెలుగు సీజన్-9
- 'డబుల్ హౌస్, డబుల్ డోస్' థీమ్తో ఈసారి సరికొత్త వినోదం
- సెలబ్రిటీలతో పాటు ఐదుగురు సామాన్యులకు అవకాశం
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్బాస్’ కొత్త సీజన్కు రంగం సిద్ధమైంది. మరో మూడు రోజుల్లో, అంటే ఈనెల 7న ‘బిగ్బాస్ సీజన్ 9’ గ్రాండ్గా ప్రారంభం కానుంది. ప్రతీసారిలాగే ఈసారి కూడా హౌస్లోకి ఎవరు అడుగుపెట్టబోతున్నారనే దానిపై సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో, కంటెస్టెంట్లుగా ప్రచారంలో ఉన్న కొందరి పేర్లతో కూడిన ఓ జాబితా ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ సీజన్ను నిర్వాహకులు 'డబుల్ హౌస్, డబుల్ డోస్' అనే సరికొత్త థీమ్తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సెలబ్రిటీలతో పాటు, 'అగ్నిపరీక్ష' పేరుతో ఎంపిక చేసిన ఐదుగురు సామాన్యులను కూడా హౌస్లోకి పంపించనున్నారని సమాచారం. ప్రస్తుతం వైరల్ అవుతున్న జాబితా ప్రకారం, ఈసారి హౌస్లో వినోదానికి కొదవ ఉండదనిపిస్తోంది.
ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి భార్య, హీరోయిన్ నిక్కీ గల్రానీ ఈ సీజన్లో పాల్గొనబోతున్నారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఆమెతో పాటు 'నరసింహనాయుడు' చిత్రంలోని ఐటమ్ సాంగ్తో గుర్తింపు తెచ్చుకున్న ఆశా షైనీ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక బుల్లితెర నుంచి 'నా పేరు మీనాక్షి' ఫేమ్ నవ్య స్వామి, 'గుప్పెడంత మనసు' సీరియల్ హీరో ముఖేశ్ గౌడ, 'కోయిలమ్మ' సీరియల్ నటి తేజస్విని గౌడ వంటి పాపులర్ నటులు ఉన్నట్లు టాక్.
వీరే కాకుండా, జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయెల్, డ్యాన్స్ షోతో పాపులర్ అయిన శ్రేష్టి వర్మ, 'రాను బొంబాయికి రాను' పాటతో ఫేమస్ అయిన సింగర్ రాము రాథోడ్, ఇటీవల 'చిట్టి పికిల్స్'తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన అలేఖ్య పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. సామాన్యుల కోటాలో ప్రియా శెట్టి, పవన్ కల్యాణ్, నాగ ప్రశాంత్ వంటి వారి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే, ఈ జాబితాలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలంటే షో ప్రారంభమయ్యే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికైతే ఈ పేర్లతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.
ఈ సీజన్ను నిర్వాహకులు 'డబుల్ హౌస్, డబుల్ డోస్' అనే సరికొత్త థీమ్తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సెలబ్రిటీలతో పాటు, 'అగ్నిపరీక్ష' పేరుతో ఎంపిక చేసిన ఐదుగురు సామాన్యులను కూడా హౌస్లోకి పంపించనున్నారని సమాచారం. ప్రస్తుతం వైరల్ అవుతున్న జాబితా ప్రకారం, ఈసారి హౌస్లో వినోదానికి కొదవ ఉండదనిపిస్తోంది.
ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి భార్య, హీరోయిన్ నిక్కీ గల్రానీ ఈ సీజన్లో పాల్గొనబోతున్నారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఆమెతో పాటు 'నరసింహనాయుడు' చిత్రంలోని ఐటమ్ సాంగ్తో గుర్తింపు తెచ్చుకున్న ఆశా షైనీ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక బుల్లితెర నుంచి 'నా పేరు మీనాక్షి' ఫేమ్ నవ్య స్వామి, 'గుప్పెడంత మనసు' సీరియల్ హీరో ముఖేశ్ గౌడ, 'కోయిలమ్మ' సీరియల్ నటి తేజస్విని గౌడ వంటి పాపులర్ నటులు ఉన్నట్లు టాక్.
వీరే కాకుండా, జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయెల్, డ్యాన్స్ షోతో పాపులర్ అయిన శ్రేష్టి వర్మ, 'రాను బొంబాయికి రాను' పాటతో ఫేమస్ అయిన సింగర్ రాము రాథోడ్, ఇటీవల 'చిట్టి పికిల్స్'తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన అలేఖ్య పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. సామాన్యుల కోటాలో ప్రియా శెట్టి, పవన్ కల్యాణ్, నాగ ప్రశాంత్ వంటి వారి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే, ఈ జాబితాలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలంటే షో ప్రారంభమయ్యే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికైతే ఈ పేర్లతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.