Somireddy Chandramohan Reddy: ప్రతిపక్ష హోదా అడుక్కుంటే రాదు... ప్రజలివ్వాలి: సజ్జలకు సోమిరెడ్డి కౌంటర్
- ప్రతిపక్ష హోదా ఇస్తే సత్తా చూపిస్తామన్న సజ్జల
- ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అడుక్కోవడం హాస్యాస్పదమన్న సోమిరెడ్డి
- పులివెందుల ప్రజల్ని కలవడానికీ జగన్కు ఎంట్రీ పాస్ కావాలా? అంటూ విమర్శలు
- కూటమి పాలనకు ప్రజల నుంచి బ్రహ్మరథం లభిస్తోందని వెల్లడి
"ప్రతిపక్ష హోదా అనేది అడుక్కుంటే వచ్చేది కాదు, అది ప్రజలు తీర్పు ద్వారా ఇవ్వాలి" అంటూ వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత, సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వచ్చి సత్తా చూపిస్తామని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, సోమిరెడ్డి స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటమిని అంగీకరించలేక, నియంతృత్వ ధోరణి నుంచి జగన్ ఇంకా బయటకు రాలేకపోతున్నారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం నాడు నెల్లూరులో మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి, వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.
"గత ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా పెత్తనం చెలాయించిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం దేబిరించడం హాస్యాస్పదంగా ఉంది. ప్రజలు తిరస్కరించిన తర్వాత ఆ హోదా కోసం పదేపదే అడుక్కోవడం సిగ్గుచేటు" అని సోమిరెడ్డి విమర్శించారు. సొంత నియోజకవర్గమైన పులివెందులలో జడ్పీటీసీని కూడా గెలిపించుకోలేని జగన్ రెడ్డిని కలవాలంటే, అక్కడి ప్రజలకు కూడా ఎంట్రీ పాసులు పెట్టడం ఆయన నియంత పోకడలకు నిదర్శనమని అన్నారు. సొంత ప్రజలనే కలుసుకోలేని నాయకుడు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తాడని ప్రశ్నించారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా సర్వనాశనమైందని సోమిరెడ్డి ఆరోపించారు. "ఆ దరిద్రపు పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారు. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ ఊరికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మేం ప్రజల్లోకి వెళ్లేందుకు ఎప్పుడూ భయపడం" అని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ వైసీపీపై విమర్శలు గుప్పించారు. "మీరు అమ్మఒడి కింద ఒక బిడ్డకే సాయం చేస్తే, మేం 'తల్లికి వందనం' పథకంతో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ లబ్ధి చేకూరుస్తున్నాం. మీరు రైతుభరోసా కింద రూ.7500 ఇస్తే, మేం 'అన్నదాత సుఖీభవ'గా రూ.13,500 అందిస్తున్నాం," అని తేడాలను వివరించారు. వీటితో పాటు 'స్త్రీశక్తి' ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 'దీపం' పథకంతో ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తూ అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు.
చంద్రబాబుపై వైసీపీ నేతలు చేస్తున్న 'వెన్నుపోటు' ఆరోపణలను సోమిరెడ్డి తీవ్రంగా ఖండించారు. "అనాడు పార్టీని ఒక మహిళ నుంచి కాపాడుకోవడం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా అందరం కలిసి చంద్రబాబును నాయకుడిగా ఎన్నుకున్నాం. అది వెన్నుపోటు అయితే ప్రజలు ఇన్నేళ్లుగా ఆయన్ను ఆదరిస్తారా? సొంత చిన్నాన్నను గొడ్డలితో దారుణంగా హత్య చేసి, ఆ నెపాన్ని మాపై వేసి 2019లో అధికారంలోకి వచ్చిన మీరా మా నాయకుడి గురించి మాట్లాడేది?" అని నిలదీశారు. ప్రజలు వాస్తవాలు గ్రహించడం వల్లే వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారని అన్నారు. ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించి, కొంచెమైనా బుద్ధితో మాట్లాడాలని వైసీపీ నేతలకు సోమిరెడ్డి హితవు పలికారు.
"గత ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా పెత్తనం చెలాయించిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం దేబిరించడం హాస్యాస్పదంగా ఉంది. ప్రజలు తిరస్కరించిన తర్వాత ఆ హోదా కోసం పదేపదే అడుక్కోవడం సిగ్గుచేటు" అని సోమిరెడ్డి విమర్శించారు. సొంత నియోజకవర్గమైన పులివెందులలో జడ్పీటీసీని కూడా గెలిపించుకోలేని జగన్ రెడ్డిని కలవాలంటే, అక్కడి ప్రజలకు కూడా ఎంట్రీ పాసులు పెట్టడం ఆయన నియంత పోకడలకు నిదర్శనమని అన్నారు. సొంత ప్రజలనే కలుసుకోలేని నాయకుడు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తాడని ప్రశ్నించారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా సర్వనాశనమైందని సోమిరెడ్డి ఆరోపించారు. "ఆ దరిద్రపు పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారు. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ ఊరికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మేం ప్రజల్లోకి వెళ్లేందుకు ఎప్పుడూ భయపడం" అని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ వైసీపీపై విమర్శలు గుప్పించారు. "మీరు అమ్మఒడి కింద ఒక బిడ్డకే సాయం చేస్తే, మేం 'తల్లికి వందనం' పథకంతో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ లబ్ధి చేకూరుస్తున్నాం. మీరు రైతుభరోసా కింద రూ.7500 ఇస్తే, మేం 'అన్నదాత సుఖీభవ'గా రూ.13,500 అందిస్తున్నాం," అని తేడాలను వివరించారు. వీటితో పాటు 'స్త్రీశక్తి' ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 'దీపం' పథకంతో ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తూ అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు.
చంద్రబాబుపై వైసీపీ నేతలు చేస్తున్న 'వెన్నుపోటు' ఆరోపణలను సోమిరెడ్డి తీవ్రంగా ఖండించారు. "అనాడు పార్టీని ఒక మహిళ నుంచి కాపాడుకోవడం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా అందరం కలిసి చంద్రబాబును నాయకుడిగా ఎన్నుకున్నాం. అది వెన్నుపోటు అయితే ప్రజలు ఇన్నేళ్లుగా ఆయన్ను ఆదరిస్తారా? సొంత చిన్నాన్నను గొడ్డలితో దారుణంగా హత్య చేసి, ఆ నెపాన్ని మాపై వేసి 2019లో అధికారంలోకి వచ్చిన మీరా మా నాయకుడి గురించి మాట్లాడేది?" అని నిలదీశారు. ప్రజలు వాస్తవాలు గ్రహించడం వల్లే వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారని అన్నారు. ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించి, కొంచెమైనా బుద్ధితో మాట్లాడాలని వైసీపీ నేతలకు సోమిరెడ్డి హితవు పలికారు.