Ganesh Shobha Yatra: ఏపీలో గణేశ్ శోభాయాత్రలో విషాదం.. నలుగురి మృతి

Ganesh Shobha Yatra Tragedy in AP Four Dead
  • నరసాపురం మండలం తూర్పుతాళ్ల గ్రామంలో ఘటన
  • గణేశ్ శోభాయాత్రలో ట్రాక్టర్ అదుపుతప్పి భక్తులపై దూసుకువెళ్లిన వైనం
  •  క్షతగాత్రులు నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం మండలం, తూర్పుతాళ్ల గ్రామంలో గణేష్ శోభాయాత్ర విషాదకరంగా ముగిసింది. శోభాయాత్రలో ట్రాక్టర్ అదుపు తప్పి భక్తులపైకి దూసుకువెళ్లడంతో నలుగురు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను తూర్పుతాళ్ల గ్రామానికి చెందిన సూర్యనారాయణ (52), మురళి (33), నరసింహమూర్తి (32), దినేశ్ (10)గా గుర్తించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
Ganesh Shobha Yatra
Andhra Pradesh
Narasapuram
Accident
Tractor accident
West Godavari district
East Thalla village
Ganesh Chaturthi
Road accident India

More Telugu News