కొడాలి నానికి తప్పని పోలీస్ స్టేషన్ హాజరు.. మరో రెండు వారాలు పొడిగింపు
మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని శనివారం గుడివాడ వన్-టౌన్ పోలీస్ స్టేషన్లో హాజరై సంతకం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుపై పెట్రోల్ ప్యాకెట్లతో దాడికి యత్నించారన్న కేసులో ఆయన బెయిల్ షరతుల్లో భాగంగా ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు ఇంకా చార్జిషీటు దాఖలు చేయకపోవడంతో ఆయన మరో రెండు వారాల పాటు ప్రతి శనివారం స్టేషన్కు వచ్చి సంతకం చేయాల్సి ఉంటుందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
గతంలో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించగా, గుడివాడ కోర్టును సంప్రదించాలని సూచించింది. దీంతో స్థానిక కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తొలుత ప్రతి మంగళ, శనివారాల్లో హాజరుకావాలని ఆదేశించిన కోర్టు, ఆ తర్వాత దానిని కేవలం శనివారానికి పరిమితం చేసింది. సాధారణంగా రెండు నెలల వ్యవధిలో చార్జిషీటు దాఖలు చేయాల్సి ఉంటుంది. కానీ గడువు ముగిసినా అది పూర్తికాకపోవడంతో బెయిల్ షరతులు కొనసాగుతున్నాయి.
శనివారం నాడే గుడివాడ రాజకీయాలు మరో కీలక పరిణామంతో వేడెక్కాయి. కొడాలి నాని తన నివాసంలో మాజీ మంత్రి పేర్ని నానితో సమావేశమయ్యారు. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరు కీలక నేతలు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సమావేశంలో కృష్ణా జిల్లాకు సంబంధించిన రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు సమాచారం.
గతంలో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించగా, గుడివాడ కోర్టును సంప్రదించాలని సూచించింది. దీంతో స్థానిక కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తొలుత ప్రతి మంగళ, శనివారాల్లో హాజరుకావాలని ఆదేశించిన కోర్టు, ఆ తర్వాత దానిని కేవలం శనివారానికి పరిమితం చేసింది. సాధారణంగా రెండు నెలల వ్యవధిలో చార్జిషీటు దాఖలు చేయాల్సి ఉంటుంది. కానీ గడువు ముగిసినా అది పూర్తికాకపోవడంతో బెయిల్ షరతులు కొనసాగుతున్నాయి.
శనివారం నాడే గుడివాడ రాజకీయాలు మరో కీలక పరిణామంతో వేడెక్కాయి. కొడాలి నాని తన నివాసంలో మాజీ మంత్రి పేర్ని నానితో సమావేశమయ్యారు. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరు కీలక నేతలు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సమావేశంలో కృష్ణా జిల్లాకు సంబంధించిన రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు సమాచారం.