Bhuvaneshwari: సిగ్గుందా మీకు?.. లలిత్ మోదీ, మైఖేల్ క్లార్క్పై శ్రీశాంత్ భార్య భువనేశ్వరి ఫైర్
- మళ్లీ తెరపైకి 2008 ఐపీఎల్ ‘స్లాప్-గేట్’ వివాదం
- పాడ్కాస్ట్లో పాత వీడియోను బయటపెట్టిన లలిత్ మోదీ
- మోదీ, క్లార్క్పై మండిపడన శ్రీశాంత్ భార్య భువనేశ్వరి
- చౌకబారు ప్రచారం కోసమే ఈ పనంటూ ఘాటు విమర్శలు
- శ్రీశాంత్, హర్భజన్ ఎప్పుడో కలిసిపోయారని వెల్లడి
- సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయిన నాటి వీడియో
ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్పై భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ భార్య భువనేశ్వరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎప్పుడో ముగిసిపోయిన ‘స్లాప్-గేట్’ వివాదాన్ని కేవలం తమ ప్రచారం కోసం మళ్లీ తెరపైకి తేవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ నిర్వహిస్తున్న ఓ పాడ్కాస్ట్లో లలిత్ మోదీ ఇటీవల పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2008 ఐపీఎల్లో శ్రీశాంత్, హర్భజన్ సింగ్ మధ్య జరిగిన గొడవకు సంబంధించిన, ఇప్పటివరకూ చూడని ఓ ఫుటేజీని ఆయన బయటపెట్టారు. ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్ తర్వాత హర్భజన్ సింగ్.. శ్రీశాంత్ చెంపపై కొడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాత వివాదం మరోసారి చర్చనీయాంశమైంది.
భువనేశ్వరి ఆగ్రహం
ఈ వీడియో మళ్లీ ప్రచారంలోకి రావడంతో భువనేశ్వరి ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. "లలిత్ మోదీ, మైఖేల్ క్లార్క్లకు సిగ్గుండాలి. కేవలం చౌకబారు ప్రచారం, వ్యూస్ కోసం 2008 నాటి విషయాన్ని మళ్లీ కెలికారు. మీలో మానవత్వం లేదు" అని పేర్కొంటూ ఆమె ఓ పోస్ట్ పెట్టారు.
"శ్రీశాంత్, హర్భజన్ ఇద్దరూ ఆ ఘటనను మర్చిపోయి ముందుకు సాగిపోయారు. వాళ్లిద్దరూ ఇప్పుడు తండ్రులు, వారి పిల్లలు స్కూల్కు వెళ్తున్నారు. అలాంటి సమయంలో పాత గాయాన్ని రేపడం హృదయం లేని, అమానవీయమైన చర్య. ఇది చాలా అసహ్యంగా ఉంది" అని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలోనే ముగిసిన వివాదం
2008 ఐపీఎల్ తొలి సీజన్లో జరిగిన ఈ ఘటన అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. మైదానంలో శ్రీశాంత్ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు అందరినీ కదిలించాయి. ఆ తర్వాత హర్భజన్ తన చర్య పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేయగా, శ్రీశాంత్ కూడా ఆ విషయాన్ని అక్కడితో వదిలేశానని పలుమార్లు చెప్పాడు. వారిద్దరూ కలిసి 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యులు కావడం గమనార్హం. ఇద్దరూ కలిసిపోయినా, సంవత్సరాల తర్వాత ఈ వీడియోను మళ్లీ బయటపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ నిర్వహిస్తున్న ఓ పాడ్కాస్ట్లో లలిత్ మోదీ ఇటీవల పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2008 ఐపీఎల్లో శ్రీశాంత్, హర్భజన్ సింగ్ మధ్య జరిగిన గొడవకు సంబంధించిన, ఇప్పటివరకూ చూడని ఓ ఫుటేజీని ఆయన బయటపెట్టారు. ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్ తర్వాత హర్భజన్ సింగ్.. శ్రీశాంత్ చెంపపై కొడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాత వివాదం మరోసారి చర్చనీయాంశమైంది.
భువనేశ్వరి ఆగ్రహం
ఈ వీడియో మళ్లీ ప్రచారంలోకి రావడంతో భువనేశ్వరి ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. "లలిత్ మోదీ, మైఖేల్ క్లార్క్లకు సిగ్గుండాలి. కేవలం చౌకబారు ప్రచారం, వ్యూస్ కోసం 2008 నాటి విషయాన్ని మళ్లీ కెలికారు. మీలో మానవత్వం లేదు" అని పేర్కొంటూ ఆమె ఓ పోస్ట్ పెట్టారు.
"శ్రీశాంత్, హర్భజన్ ఇద్దరూ ఆ ఘటనను మర్చిపోయి ముందుకు సాగిపోయారు. వాళ్లిద్దరూ ఇప్పుడు తండ్రులు, వారి పిల్లలు స్కూల్కు వెళ్తున్నారు. అలాంటి సమయంలో పాత గాయాన్ని రేపడం హృదయం లేని, అమానవీయమైన చర్య. ఇది చాలా అసహ్యంగా ఉంది" అని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలోనే ముగిసిన వివాదం
2008 ఐపీఎల్ తొలి సీజన్లో జరిగిన ఈ ఘటన అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. మైదానంలో శ్రీశాంత్ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు అందరినీ కదిలించాయి. ఆ తర్వాత హర్భజన్ తన చర్య పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేయగా, శ్రీశాంత్ కూడా ఆ విషయాన్ని అక్కడితో వదిలేశానని పలుమార్లు చెప్పాడు. వారిద్దరూ కలిసి 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యులు కావడం గమనార్హం. ఇద్దరూ కలిసిపోయినా, సంవత్సరాల తర్వాత ఈ వీడియోను మళ్లీ బయటపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.