G Venkateswaran: మ‌ణిర‌త్నం సోద‌రుడు మరణించిన 22ఏళ్లకు కోర్టు తీర్పు

Mani Ratnams Brother G Venkateswaran Case Verdict
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ దర్శకుడు మణిరత్నం సోదరుడు, తమిళ సినీ నిర్మాత జి. వెంకటేశ్వరన్ కన్నుమూసి 22 సంవత్సరాలు గడిచిపోయాయి. అయితే, ఆయనపై నమోదైన ఓ బ్యాంకు మోసం కేసులో చెన్నైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తాజాగా తీర్పు వెలువరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మరణించిన కారణంగా ఈ కేసు నుంచి ఆయన పేరును కోర్టు తొలగించింది.

వివరాల్లోకి వెళ్తే, 1996లో జి. వెంకటేశ్వరన్ తప్పుడు పత్రాలు సమర్పించి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 10.19 కోట్ల రుణం పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. బ్యాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. సుమారు మూడు దశాబ్దాల పాటు సాగిన ఈ కేసు విచారణలో, చెన్నై ప్రత్యేక కోర్టు తాజాగా తుది తీర్పును వెల్లడించింది.

ఈ కేసులో నిందితులుగా ఉన్న తొమ్మిది మందిని న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. అయితే, ప్రధాన నిందితుడైన వెంకటేశ్వరన్‌తో పాటు మరో ముగ్గురు బ్యాంకు అధికారులు విచారణ కొనసాగుతుండగానే మరణించారు. దీంతో, మరణించిన వారిపై ఉన్న అభియోగాలను కోర్టు కొట్టివేసింది. మిగిలిన ఐదుగురు దోషుల పరిస్థితిపై త్వరలో స్పష్టత రానుంది.

కాగా, జి. వెంకటేశ్వరన్ తన సోదరుడు మణిరత్నం దర్శకత్వంలో ‘మౌనరాగం’, ‘దళపతి’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అయితే, తీవ్రమైన అప్పుల ఒత్తిడి కారణంగా ఆయన 2003 మే 3న ఆత్మహత్యకు పాల్పడ్డారు. సినిమాలు తీయడానికి చేసిన అప్పులు, వాటి వల్ల వచ్చిన నష్టాలు తట్టుకోలేకే ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. 
Go Back to Shorts
G Venkateswaran
Mani Ratnam
Tamil film producer
Central Bank of India
bank fraud case
Chennai CBI court
Mauna Ragam
Dalapathi
Tamil cinema

More Telugu News