Dinesh Mangaluru: 'కేజీఎఫ్' నటుడు దినేశ్ మంగళూరు మృతి
- బ్రెయిన్ హెమరేజ్తో కుందాపుర ఆసుపత్రిలో తుదిశ్వాస
- కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు
- ఆర్ట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించిన దినేశ్
పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన 'కేజీఎఫ్' చిత్రంలో కీలక పాత్ర పోషించి గుర్తింపు పొందిన ప్రముఖ కన్నడ నటుడు దినేశ్ మంగళూరు (55) సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఉడుపి జిల్లాలోని కుందాపురలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో కన్నడ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి.
దినేశ్ కొన్ని రోజులుగా బ్రెయిన్ హెమరేజ్తో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ను మొదట బెంగళూరులోని ఆసుపత్రికి, ఆ తర్వాత కుందాపురలోని సర్గన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, పరిస్థితి విషమించడంతో ఆయన చికిత్సకు స్పందించలేకపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు.
'కేజీఎఫ్ చాప్టర్ 1', 'కేజీఎఫ్ చాప్టర్ 2' చిత్రాలలో ముంబై డాన్, గోల్డ్ స్మగ్లర్గా దినేశ్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. రంగస్థల నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, తొలినాళ్లలో ఆర్ట్ డైరెక్టర్గా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 'ఆస్ఫోట' (1988), 'చంద్రముఖి ప్రాణసఖి' (1999) వంటి చిత్రాలకు కళా దర్శకుడిగా పనిచేశారు. ఆ తర్వాత నటన వైపు మళ్లి 'ఆ దినగళు', 'కిచ్చా', 'కిరిక్ పార్టీ', 'ఉళిదవారు కండాంతె' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలలో సహాయ నటుడిగా మెప్పించారు.
దినేశ్ మంగళూరు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఒక సృజనాత్మక దర్శకుడు, కళాకారుడు, నిర్మాత, నా ప్రియ స్నేహితుడు దినేశ్ ఇక లేరు. శాంతితో వెళ్లు మిత్రమా" అంటూ ప్రముఖ దర్శకుడు పి. శేషాద్రి సోషల్ మీడియాలో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. 1970 జనవరి 1న మంగళూరులో జన్మించిన దినేశ్కు భార్య భారతి పాయ్, ఇద్దరు కుమారులు సూర్య సిద్ధార్థ, సజన్ పాయ్ ఉన్నారు.
దినేశ్ కొన్ని రోజులుగా బ్రెయిన్ హెమరేజ్తో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ను మొదట బెంగళూరులోని ఆసుపత్రికి, ఆ తర్వాత కుందాపురలోని సర్గన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, పరిస్థితి విషమించడంతో ఆయన చికిత్సకు స్పందించలేకపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు.
'కేజీఎఫ్ చాప్టర్ 1', 'కేజీఎఫ్ చాప్టర్ 2' చిత్రాలలో ముంబై డాన్, గోల్డ్ స్మగ్లర్గా దినేశ్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. రంగస్థల నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, తొలినాళ్లలో ఆర్ట్ డైరెక్టర్గా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 'ఆస్ఫోట' (1988), 'చంద్రముఖి ప్రాణసఖి' (1999) వంటి చిత్రాలకు కళా దర్శకుడిగా పనిచేశారు. ఆ తర్వాత నటన వైపు మళ్లి 'ఆ దినగళు', 'కిచ్చా', 'కిరిక్ పార్టీ', 'ఉళిదవారు కండాంతె' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలలో సహాయ నటుడిగా మెప్పించారు.
దినేశ్ మంగళూరు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఒక సృజనాత్మక దర్శకుడు, కళాకారుడు, నిర్మాత, నా ప్రియ స్నేహితుడు దినేశ్ ఇక లేరు. శాంతితో వెళ్లు మిత్రమా" అంటూ ప్రముఖ దర్శకుడు పి. శేషాద్రి సోషల్ మీడియాలో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. 1970 జనవరి 1న మంగళూరులో జన్మించిన దినేశ్కు భార్య భారతి పాయ్, ఇద్దరు కుమారులు సూర్య సిద్ధార్థ, సజన్ పాయ్ ఉన్నారు.