Hyderabad: ల‌వ్ మ్యారేజ్‌.. గ‌ర్భ‌వ‌తైన‌ భార్య‌ను ముక్క‌లుగా న‌రికిన భ‌ర్త‌

Hyderabad Man Kills Pregnant Wife Dismembers Body
  • మేడ్చ‌ల్ జిల్లా మేడిప‌ల్లిలోని బాలాజీహిల్స్‌లో ఘ‌ట‌న‌
  • ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య‌ను దారుణంగా హ‌త‌మార్చిన భ‌ర్త‌
  • గ‌ర్భ‌వ‌తైన భార్యను చంపి ముక్క‌లు ముక్క‌లుగా చేసిన వైనం
  • స్థానికుల ద్వారా వెలుగులోకి వ‌చ్చిన దారుణం
న‌గ‌రం ఉలిక్కిప‌డే ఘ‌ట‌న ఇది. హైద‌రాబాద్ శివారు మేడ్చ‌ల్ జిల్లా మేడిప‌ల్లిలో గ‌ర్భ‌వ‌తైన భార్య‌ను ముక్క‌లుగా న‌రికాడో భ‌ర్త‌. వివ‌రాల్లోకి వెళితే.. మేడిప‌ల్లి ప‌రిధి బాలాజీహిల్స్‌లో ఈ దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడ‌కు చెందిన స్వాతి, మ‌హేంద‌ర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్ర‌స్తుతం బోడుప్ప‌ల్‌లోని బాలాజీహిల్స్‌లో నివాసం ఉంటున్నారు. 

గ‌ర్భ‌వ‌తైన భార్య స్వాతిని భ‌ర్త మ‌హేంద‌ర్ చంపి ముక్క‌లుగా నరికాడు. ఆ త‌ర్వాత శ‌రీర భాగాల‌ను ప్లాస్టిక్‌ క‌వ‌ర్‌లో ప్యాక్ చేసి.. బ‌య‌ట‌కు తీసుకెళ్లి ప‌డేయాల‌ని చూశాడు. అయితే, గ‌ది నుంచి శ‌బ్ధాలు రావ‌డంతో పొరుగింటి వారు వెళ్లి చూశారు. దీంతో ఈ దారుణ ఘ‌ట‌న బ‌య‌ట‌ప‌డింది. మ‌హేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌పై అత‌డిని విచారిస్తున్నారు. 
Hyderabad
Mahender
Hyderabad murder
Medipally crime
Wife murdered
Pregnancy crime
Love marriage murder
Telangana crime news
Crime news
Boduppal
Balaji Hills

More Telugu News