జగన్కు రాజ్నాథ్ సింగ్ ఫోన్... మద్దతిస్తారా?
- ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని విజ్ఞప్తి
- ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో ఉన్న రాధాకృష్ణన్
- బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నేపథ్యంలో జగన్ నిర్ణయంపై ఉత్కంఠ
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సమయంలో, ఎన్డీఏ తమ అభ్యర్థిగా రాధాకృష్ణన్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ఎన్నికను ఏకగ్రీవం చేసే ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ నాయకత్వం వివిధ పార్టీల మద్దతు కూడగడుతోంది. ఈ క్రమంలోనే రాజ్నాథ్ సింగ్ స్వయంగా జగన్తో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రస్తుతం తెలుగుదేశం, జనసేన పార్టీలతో కూటమిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తన రాజకీయ ప్రత్యర్థులతో కలిసి ఉన్న బీజేపీకి జగన్ మద్దతు ఇస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.