ఢిల్లీలో కేంద్రమంత్రి నడ్డాతో నారా లోకేశ్ భేటీ... ఏపీకి కీలక హామీలు
- కేంద్రమంత్రి జేపీ నడ్డాతో మంత్రి నారా లోకేష్ భేటీ
- ఏపీకి 29 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు
- ఈ నెల 21 నాటికి యూరియా సరఫరా చేస్తామని హామీ
- రాష్ట్రంలో ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం
- విశాఖ నిపర్కు శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయాలని వినతి
- పోలవరం, అమరావతి పనులు మళ్లీ పట్టాలెక్కాయని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక పరిశ్రమల అభివృద్ధి, యువతకు ఉపాధి కోసం ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటుకు సహకారం అందించాలని మంత్రి లోకేశ్ కోరగా, జేపీ నడ్డా ఆమోదం తెలిపారు. విశాఖపట్నంలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (NIPER) శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమైన 100 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని లోకేశ్ చెప్పారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 14 నెలలుగా కొనసాగతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని లోకేశ్ ఈ సందర్భంగా కేంద్రమంత్రికి వివరించారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు సహకారం అందించాలని విజ్ఞప్తిచేశారు. కేంద్రప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం, అమరావతి రాజధాని పనులు మళ్లీ పట్టాలెక్కాయని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కారుతో ఆంధ్రప్రదేశ్ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.






