భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటి ఉద్ధృతి.. సాయంత్రానికి 29.6 అడుగులకు చేరిన నీటిమట్టం
- రెండు రోజుల క్రితం 16 అడుగుల వద్ద నీటిమట్టం
- నేటి సాయంత్రానికి 29 అడుగులకు చేరిన నీటిమట్టం
- స్నానమాచరించే భక్తులు లోపలకు వెళ్లవద్దని హెచ్చరిక
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భద్రాచలం వద్ద నదిలో స్నానమాచరించే భక్తులు నది లోపలకి వెళ్లకుండా ఒడ్డునే ఉండి స్నానమాచరించాలని ఆదేశాలు జారీ చేశారు. నది వద్ద లాంచీలు, పడవలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.