Bhadrachalam: భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటి ఉద్ధృతి.. సాయంత్రానికి 29.6 అడుగులకు చేరిన నీటిమట్టం

Bhadrachalam Godavari Water Level Rises to 296 Feet
  • రెండు రోజుల క్రితం 16 అడుగుల వద్ద నీటిమట్టం
  • నేటి సాయంత్రానికి 29 అడుగులకు చేరిన నీటిమట్టం
  • స్నానమాచరించే భక్తులు లోపలకు వెళ్లవద్దని హెచ్చరిక
భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం సాయంత్రానికి గోదావరి నీటి మట్టం 29.6 అడుగులు దాటి ప్రవహిస్తోంది. రెండు రోజుల క్రితం 16 అడుగుల మేర ఉన్న గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతూ 29 అడుగులు దాటింది.

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భద్రాచలం వద్ద నదిలో స్నానమాచరించే భక్తులు నది లోపలకి వెళ్లకుండా ఒడ్డునే ఉండి స్నానమాచరించాలని ఆదేశాలు జారీ చేశారు. నది వద్ద లాంచీలు, పడవలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.
Bhadrachalam
Godavari River
Telangana Floods
Bhadrachalam Water Level
Godavari Water Level

More Telugu News