ICC Women's Cricket World Cup 2025: మహిళల వన్డే ప్రపంచకప్‌ ట్రోఫీ ఆవిష్కరణ

ఈసారి మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీకి భార‌త్ ఆతిథ్యం ఇస్తున్న విష‌యం తెలిసిందే. మరో 50 రోజుల్లో మహిళ వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ముంబైలో ‘ఐసీసీ మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌-2025’ ట్రోఫీని ఆవిష్కరించారు. 

ఐసీసీ ఛైర్మన్‌ జై షా, ఐసీసీ సీఈఓ సంజోగ్‌ గుప్తాతో పాటు భారత మాజీ క్రికెట‌ర్లు యువరాజ్‌ సింగ్, మిథాలీ రాజ్‌, ప్రస్తుత టీమిండియా మహిళా క్రికెట‌ర్లు హర్మన్‌ ప్రీత్‌ కౌర్, స్మృతి మందాన, జెమీమా రోడ్రిగ్స్‌, ఈ ట్రోఫీ ఆవిష్కరణలో పాల్గొన్నారు.  

ఇక‌, ఈ మెగా ఐసీసీ టోర్నీ సెప్టెంబర్‌ 30న ప్రారంభం కానుంది. అయితే 2016 తర్వాత భారత్‌ మహిళల ఐసీసీ క్రికెట్‌ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. 2016లో భారత్‌లో మహిళల టీ20 క్రికెట్‌ ప్రపంచకప్‌ జరిగింది. 
ICC Women's Cricket World Cup 2025
Womens World Cup
Jay Shah
Mithali Raj
Harmanpreet Kaur
Smriti Mandhana
Yuvraj Singh
ICC CEO Sanjog Gupta
Womens Cricket
India Cricket

More Telugu News