Arvind Kumar: బంగాళాఖాతంలో అల్పపీడనం... తెలంగాణలో మరింత తీవ్ర రూపం దాల్చనున్న వర్షాలు
- ఆగస్టు 13 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం
- హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు
- హైదరాబాద్లోని కార్యాలయాలు పనివేళల్లో మార్పులు చేసుకోవాలని అధికారుల సూచన
ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు 13 నాటికి అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం ప్రకటించింది. దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు తీవ్రరూపం దాల్చనున్నాయని తెలిపింది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఈ విషయంపై స్పందిస్తూ, హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఎక్స్ వేదికగా తెలిపారు.
భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు, ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్లోని కార్యాలయాలు ఆగస్టు 13, 14 తేదీల్లో పనివేళల్లో మార్పులు చేసుకోవాలని ఆయన సూచించారు.
వాతావరణ శాఖ సూచనల మేరకు, ఆగస్టు 13న ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదే రోజు హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడనున్నాయి. ఆగస్టు 14న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఇప్పటికే హైదరాబాద్ సహా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం తర్వాత, ఆదివారం కూడా వర్షాలు కొనసాగాయి. దీంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరవాసులను హెచ్చరించారు. అనవసరంగా బయటకు రావద్దని, ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. గంటకు 10 సెం.మీ.కు పైగా వర్షం కురుస్తుండటంతో నగరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయని అర్వింద్ కుమార్ పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం సాధారణంగానే ఉందని, హైదరాబాద్ సహా ఎనిమిది జిల్లాల్లో అధిక వర్షపాతం, ఏడు జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని ఆయన వివరించారు.
భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు, ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్లోని కార్యాలయాలు ఆగస్టు 13, 14 తేదీల్లో పనివేళల్లో మార్పులు చేసుకోవాలని ఆయన సూచించారు.
వాతావరణ శాఖ సూచనల మేరకు, ఆగస్టు 13న ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదే రోజు హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడనున్నాయి. ఆగస్టు 14న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఇప్పటికే హైదరాబాద్ సహా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం తర్వాత, ఆదివారం కూడా వర్షాలు కొనసాగాయి. దీంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరవాసులను హెచ్చరించారు. అనవసరంగా బయటకు రావద్దని, ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. గంటకు 10 సెం.మీ.కు పైగా వర్షం కురుస్తుండటంతో నగరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయని అర్వింద్ కుమార్ పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం సాధారణంగానే ఉందని, హైదరాబాద్ సహా ఎనిమిది జిల్లాల్లో అధిక వర్షపాతం, ఏడు జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని ఆయన వివరించారు.