Mahesh Kumar Goud: కేసీఆర్ వల్లే ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు చేపట్టింది: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud Alleges KCR Behind APs Banakacherla Project
షార్ట్స్‌లో చూడండి
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి, పొరుగు రాష్ట్రానికి లబ్ధి చేకూర్చేలా కేసీఆర్ వ్యవహరించారని ఆయన తీవ్రంగా విమర్శించారు. 

"గోదావరిలో 3 వేల టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయి, వాటిని ఏపీ వాడుకోవచ్చు" అని గతంలో కేసీఆరే స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణను పక్కనపెట్టి, రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆయన మాటలతోనే ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన జనహిత పాదయాత్రలో భాగంగా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌ గ్రామంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 
Go Back to Shorts
Mahesh Kumar Goud
KCR
K Chandrasekhar Rao
Telangana
Andhra Pradesh
Banakacherla Project
TPCC
Revanth Reddy
Godavari River
Rayalaseema

More Telugu News