Uttar Pradesh road accident: యూపీలో ఘోర ప్రమాదం... కాలువలోకి దూసుకెళ్లిన కారు... 11 మంది మృతి
- ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- సరయూ కాలువలోకి దూసుకెళ్లిన భక్తుల వాహనం
- ఈ ఘటనలో 11 మంది దుర్మరణం, నలుగురికి గాయాలు
- మృతుల కుటుంబాలకు సీఎం యోగి రూ. 5 లక్షల పరిహారం
- ప్రధాని మోదీ రూ. 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటన
ఉత్తరప్రదేశ్లో ఆదివారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులతో వెళుతున్న ఒక వాహనం అదుపుతప్పి కాలువలో పడటంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన గోండా జిల్లాలో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు.
మోతిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహగావ్ గ్రామానికి చెందిన 14 మంది ఒక బొలెరో వాహనంలో ఖర్గుపూర్లోని పృథ్వీనాథ్ ఆలయానికి పూజల కోసం బయలుదేరారు. మార్గమధ్యంలో వీరి వాహనం సరయూ కాలువలోకి దూసుకెళ్లింది. వాహనం నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కొందరు గ్రామ పెద్దకు విషయం చేరవేశారు.
సమాచారం అందుకున్న ఇటియాథోక్ పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నీటిలో మునిగిపోయిన వాహనం నుంచి మృతదేహాలను వెలికితీశారు. మృతులలో పురుషులు, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ దుర్ఘటనపై జిల్లా ఎస్పీ వినీత్ జైస్వాల్ మాట్లాడుతూ, "ఆలయానికి వెళుతుండగా బొలెరో వాహనం కాలువలో పడిపోవడంతో 11 మంది మరణించారు. స్వల్ప గాయాలతో బయటపడిన నలుగురిని రక్షించి జిల్లా ఆసుపత్రికి తరలించాం" అని తెలిపారు.
ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు తలా రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందిస్తామని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
మోతిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహగావ్ గ్రామానికి చెందిన 14 మంది ఒక బొలెరో వాహనంలో ఖర్గుపూర్లోని పృథ్వీనాథ్ ఆలయానికి పూజల కోసం బయలుదేరారు. మార్గమధ్యంలో వీరి వాహనం సరయూ కాలువలోకి దూసుకెళ్లింది. వాహనం నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కొందరు గ్రామ పెద్దకు విషయం చేరవేశారు.
సమాచారం అందుకున్న ఇటియాథోక్ పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నీటిలో మునిగిపోయిన వాహనం నుంచి మృతదేహాలను వెలికితీశారు. మృతులలో పురుషులు, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ దుర్ఘటనపై జిల్లా ఎస్పీ వినీత్ జైస్వాల్ మాట్లాడుతూ, "ఆలయానికి వెళుతుండగా బొలెరో వాహనం కాలువలో పడిపోవడంతో 11 మంది మరణించారు. స్వల్ప గాయాలతో బయటపడిన నలుగురిని రక్షించి జిల్లా ఆసుపత్రికి తరలించాం" అని తెలిపారు.
ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు తలా రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందిస్తామని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.