కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక... అధ్యయనానికి కమిటీ ఏర్పాటు

  • కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు
  • పీసీ ఘోష్ కమిషన్ ను నియమించిన రేవంత్ సర్కారు 
  • నివేదిక సమర్పించిన కమిషన్ 
  • నీటిపారుదల శాఖ, న్యాయ శాఖ, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శులతో అధ్యయన కమిటీ
తెలంగాణలోని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై తదుపరి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నివేదికను సమగ్రంగా అధ్యయనం చేసి, సారాంశాన్ని సిద్ధం చేయడానికి ప్రభుత్వం శుక్రవారం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీలో నీటిపారుదల శాఖ, న్యాయ శాఖ, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఆగస్టు 4న రాష్ట్ర మంత్రిమండలికి తన నివేదికను సమర్పించనుంది. ఆ తర్వాత క్యాబినెట్ సమావేశంలో ఈ నివేదికలోని సిఫార్సులు, అంశాలపై చర్చించి, తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు.

సుమారు 700 పేజీల నివేదికను పీసీ ఘోష్ కమిషన్ గురువారం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేసింది. అనంతరం శుక్రవారం ఈ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ముఖ్యమంత్రి చర్చించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలను ఈ నివేదిక ప్రస్తావించినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా దోషులుగా తేలిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలా లేదా అనే దానిపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగనుంది. అలాగే, తప్పు చేసిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోం


More Telugu News