సిగాచీ పరిశ్రమ పేలుడు.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
- పరిశ్రమలో పేలుడు ఘటనపై హైకోర్టులో పిల్ దాఖలు చేసిన కె. బాబురావు
- మృతుల కుటుంబాలకు ఇప్పటి వరకు పరిహారం చెల్లించలేదని పిటిషన్
- పరిశ్రమ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న పిటిషనర్
మృతుల ఆచూకీ లేని కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇప్పటివరకు చెల్లించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా పరిశ్రమ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పేలుడుకు గల కారణాలను అన్వేషించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని కోరారు. భానూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసును సిట్ ద్వారా దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అన్ని పరిశ్రమలలో భద్రతా చర్యలు పటిష్ఠంగా ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు, మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.