క్రికెట్లోకి రాజకీయాలను లాగొద్దు.. భారత్-పాక్ మ్యాచ్ రద్దుపై కేంద్రమంత్రి అథవాలే స్పందన
- భారత్-పాక్ జట్ల మధ్య వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ మ్యాచ్
- రద్దు చేసిన నిర్వాహకులు
- రాజకీయ ఆటంకాలు సృష్టించడం దురదృష్టకరమన్న అథవాలే
ఈ విషయంపై అథవాలే మాట్లాడుతూ, "క్రీడలు రాజకీయాలకు అతీతంగా ఉండాలి. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ను విదేశాల్లో నిర్వహించేందుకు రాజకీయ ఆటంకాలు సృష్టించడం దురదృష్టకరం" అని పేర్కొన్నారు. మ్యాచ్ భారత్ లో జరిగేట్టయితే ఆలోచించవచ్చు.. కానీ ఈ మ్యాచ్ జరుగుతోంది ఇంగ్లండ్ లో... ఇటువంటి మ్యాచ్లు రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచే అవకాశంగా ఉపయోగపడాలని ఆయన సూచించారు.
ఈ వివాదంపై ఇతర క్రీడా సంఘాలు, అభిమానులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. క్రీడా రంగంలో రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని, ఆటగాళ్లకు స్వేచ్ఛగా పోటీపడే అవకాశం కల్పించాలని అథవాలే పిలుపునిచ్చారు.