ఫోన్ ట్యాపింగ్... బండి సంజయ్కి సిట్ నుంచి పిలుపు
- ఈ నెల 24న వాంగ్మూలం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన అధికారులు
- లేక్ వ్యూ అతిథి గృహంలో స్టేట్మెంట్ ఇవ్వాలని పేర్కొన్న సిట్
- ఫోన్ ట్యాపింగ్ కేసులో నేతల వాంగ్మూలం తీసుకుంటున్న సిట్
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివిధ పార్టీలకు చెందిన ఫోన్లను గత ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్య నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో సిట్ పలువురు నేతలను పిలిచి వాంగ్మూలం తీసుకుంటోంది.