ఢిల్లీ నుంచి కర్నూలుకు బయల్దేరిన చంద్రబాబు
- ముగిసిన చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటన
- నేడు నంద్యాల జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి
- మల్యాల ఎత్తిపోతల నుంచి హంద్రీనీవాకు నీటిని విడుదల చేయనున్న సీఎం
ఢిల్లీ పర్యటనను ముగించుకున్న చంద్రబాబు నేరుగా కర్నూలుకు బయల్దేరారు. నేడు నంద్యాల జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. నందికొట్కూరు మండలం మల్యాల ఎత్తిపోతల నుంచి హంద్రీనీవాకు నీటిని విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 12.45 గంటలకు ఆల్లూరుకు చేరుకుంటారు. 1 గంటకు మల్యాల ఎత్తిపోతల నుంచి హంద్రీనీవాకు నీటిని విడుదల చేస్తారు. హంద్రీనీవా కాలువలో జలాలకు జలహారతి ఇవ్వనున్నారు. హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. అనంతరం మల్యాలలో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు.