Rajeev Shukla: బ్రిటన్ రాజుకు పుస్తకం కానుకగా ఇచ్చిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు... సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు!
- ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు
- బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆధ్వర్యంలో బ్రిటన్ రాజు చార్లెస్ 3ని మర్యాదపూర్వక కలిసిన వైనం
- బ్రిటన్ రాజుకు ‘స్కార్స్ ఆఫ్ 1947: రియల్ పార్టీషన్ స్టోరీస్’ పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చిన రాజీవ్ శుక్లా
- ఈ పుస్తకాన్ని చదివేందుకు బ్రిటన్ రాజు ఎంతో ఆసక్తి చూపించారన్న రాజీవ్ శుక్లా
బ్రిటన్ రాజు చార్లెస్ 3కి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా బహుమతి ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారగా, నెటిజన్లు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు బ్రిటన్ రాజు చార్లెస్ 3ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాజీవ్ శుక్లా రచించిన ‘స్కార్స్ ఆఫ్ 1947: రియల్ పార్టీషన్ స్టోరీస్’ పుస్తకాన్ని చార్లెస్ 3కి బహుమతిగా అందజేశారు. 1947లో దేశ విభజన సమయంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా రాజీవ్ శుక్లా ఈ పుస్తకాన్ని రచించారు. ఈ విషయాన్ని శుక్లా తన సోషల్ మీడియా ఖాతా 'ఎక్స్'లో పంచుకుంటూ, పుస్తకాన్ని చదవడానికి బ్రిటన్ రాజు ఎంతో ఆసక్తి చూపించారని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్న రీతుల్లో స్పందిస్తున్నారు. కొందరు రాజీవ్ శుక్లాను విమర్శిస్తూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఆ కానుకకు బదులుగా మన కోహినూర్ వజ్రాన్ని తీసుకురండి అని కొందరు కామెంట్ చేయగా, బ్రిటీషర్లు మిగిల్చిన మరకలను ఆ దేశ రాజుకే చూపిస్తున్నారా, ఇది చరిత్రలో గొప్ప మీమ్గా నిలిచిపోతుంది అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు.
ఈ సందర్భంగా రాజీవ్ శుక్లా రచించిన ‘స్కార్స్ ఆఫ్ 1947: రియల్ పార్టీషన్ స్టోరీస్’ పుస్తకాన్ని చార్లెస్ 3కి బహుమతిగా అందజేశారు. 1947లో దేశ విభజన సమయంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా రాజీవ్ శుక్లా ఈ పుస్తకాన్ని రచించారు. ఈ విషయాన్ని శుక్లా తన సోషల్ మీడియా ఖాతా 'ఎక్స్'లో పంచుకుంటూ, పుస్తకాన్ని చదవడానికి బ్రిటన్ రాజు ఎంతో ఆసక్తి చూపించారని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్న రీతుల్లో స్పందిస్తున్నారు. కొందరు రాజీవ్ శుక్లాను విమర్శిస్తూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఆ కానుకకు బదులుగా మన కోహినూర్ వజ్రాన్ని తీసుకురండి అని కొందరు కామెంట్ చేయగా, బ్రిటీషర్లు మిగిల్చిన మరకలను ఆ దేశ రాజుకే చూపిస్తున్నారా, ఇది చరిత్రలో గొప్ప మీమ్గా నిలిచిపోతుంది అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు.