Kejriwal: నోబెల్ కు అర్హుడినన్న కేజ్రీవాల్.. అవినీతి కేటగిరీలో ఇవ్వాల్సిందేనన్న బీజేపీ

Arvind Kejriwal Claims Nobel Prize Worthiness BJP Retorts on Corruption
  • ఢిల్లీ రాజకీయాల్లో మాటల యుద్ధం.. నోబెల్‌పై ఆప్, బీజేపీ ఫైర్
  • అడ్డంకులున్నా ఢిల్లీలో గొప్ప పాలన అందించానని కేజ్రీవాల్ వ్యాఖ్య
  • విమర్శలు మాని పాలనపై దృష్టి పెట్టాలని బీజేపీకి ఆప్ హితవు
తన పాలనకు గానూ తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. చండీగఢ్‌లో మంగళవారం జరిగిన 'ది కేజ్రీవాల్ మోడల్' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

"ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ సహా ఎన్నో శక్తులు మా ప్రభుత్వాన్ని అడ్డుకున్నా, మేము అద్భుతంగా పనిచేశాం. ఇన్ని అడ్డంకుల మధ్య ఇంత గొప్ప పాలన అందించినందుకు నాకు నోబెల్ బహుమతి ఇవ్వాలి" అని కేజ్రీవాల్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా స్పందిస్తూ.. "అసమర్థత, అరాచకం, అవినీతి విభాగాల్లో నోబెల్ బహుమతి ఉండుంటే కేజ్రీవాల్‌కు తప్పకుండా వచ్చేది" అని ఎద్దేవా చేశారు. లిక్కర్ స్కామ్, బస్సుల్లో పానిక్ బటన్లు, తరగతి గదుల నిర్మాణం, ముఖ్యమంత్రి నివాసమైన 'షీష్ మహల్' వివాదం వంటి ఎన్నో కుంభకోణాలు కేజ్రీవాల్ హయాంలో జరిగాయని ఆయన ఆరోపించారు.

బీజేపీ విమర్శలపై ఆప్ కూడా ఘాటుగా బదులిచ్చింది. బీజేపీ నేతలు విమర్శలు మాని పాలనపై దృష్టి పెట్టాలని ఆప్ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ హితవు పలికారు. "ఇక ప్రతిపక్షంలో ఉన్న రోజులు పోయాయి, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. మాటలు కాదు, చేతలు కావాలని ఢిల్లీ ప్రజలు ఎదురుచూస్తున్నారు" అని ఆయన అన్నారు.
Kejriwal
AAP
BJP
Delhi
Nobel Prize
corruption
liquor scam
governance
Virendra Sachdeva
Saurabh Bharadwaj

More Telugu News