Rajasekhar Babu: టీటీడీ ఏఈవో రాజశేఖర్ బాబుపై వేటు... కారణం ఇదే!

TTD Suspends AEO Rajasekhar Babu After Prayer Meeting Photos Surface
  • అన్యమత ప్రార్థనలకు హాజరవుతున్న టీటీడీ ఏఈవో
  • ఓ భక్తుడి ఫిర్యాదు
  • విచారణ జరిపిన టీటీడీ విజిలెన్స్ అధికారులు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏఈవో రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన అన్యమత ప్రార్థనలకు హాజరవుతున్నాడని టీటీడీ నిర్ధారించింది. ఈ మేరకు రాజశేఖర్ బాబును విధుల నుంచి సస్పెండ్ చేసింది. రాజశేఖర్ బాబు గత కొంతకాలంగా పుత్తూరులో అన్యమత ప్రార్థనలకు హాజరవుతున్న విషయాన్ని ఓ భక్తుడు ఫొటోలు తీసి టీటీడీ దృష్టికి తీసుకువచ్చాడు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న టీటీడీ విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టి, రాజశేఖర్ బాబు ప్రతి ఆదివారం నాడు అన్యమత ప్రార్థనా మందిరానికి హాజరవుతున్నట్టు గుర్తించింది. ఇది టీటీడీ నియమావళికి విరుద్ధం కావడంతో, ఆయనపై తాజాగా చర్యలు తీసుకున్నారు. 
Rajasekhar Babu
TTD
TTD AEO
Tirumala Tirupati Devasthanam
Other Religion Prayers
Suspension
Puttur
TTD Vigilance

More Telugu News