Achchennaidu: ఏపీకి మూడు కొత్త బోర్డులు.. కేంద్ర మంత్రికి అచ్చెన్నాయుడు కీలక వినతులు

Achchennaidu requests three new boards for AP to Union Minister
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో ఆయన మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు మూడు ప్రధాన వ్యవసాయ బోర్డులను ఏర్పాటు చేయాలని అచ్చెన్నాయుడు కోరారు. గుంటూరులో మిర్చి బోర్డు, శ్రీకాకుళంలో జీడిపప్పు బోర్డు, చిత్తూరులో మామిడి బోర్డును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వీటితో పాటు, విభజన చట్టంలోని హామీ మేరకు శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు.

ముఖ్యంగా, తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర నష్టాలను అచ్చెన్నాయుడు కేంద్రమంత్రికి వివరించారు. మార్కెట్‌లో ధర కిలోకు రూ. 8కి పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, ధరల లోటు చెల్లింపు పథకం కింద మద్దతు ధరగా రూ. 12 నిర్ణయించిందని పేర్కొన్నారు. ఇందుకోసం 6.5 లక్షల మెట్రిక్ టన్నుల మామిడిని కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 260 కోట్లు ఖర్చు చేస్తోందని, ఈ భారాన్ని తగ్గించేందుకు కేంద్రం కూడా భాగస్వామ్యం కావాలని అభ్యర్థించారు.

అలాగే, వెనుకబడిన జిల్లాలకు మైక్రో ఇరిగేషన్ పథకం కింద రాయితీని పెంచాలని, ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ తరహాలో ఆంధ్రప్రదేశ్‌కు కూడా ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేయాలని కోరారు. అచ్చెన్నాయుడు చేసిన వినతులపై కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. 
Go Back to Shorts
Achchennaidu
Andhra Pradesh agriculture
Shivraj Singh Chouhan
chilli board
cashew board
mango board
central agricultural university
Totapuri mango farmers
price deficit scheme
micro irrigation scheme

More Telugu News