Taliban: తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన రష్యా.. ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం!

- తాలిబాన్ సర్కార్ను గుర్తించిన మొట్టమొదటి దేశంగా రష్యా రికార్డు
- మాస్కోలో కొత్త ఆఫ్ఘన్ రాయబారి నియామకానికి ఆమోదం
- రష్యా నిర్ణయాన్ని స్వాగతించిన తాలిబాన్లు
ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆఫ్ఘనిస్థాన్ లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని రష్యా అధికారికంగా గుర్తించింది. 2021లో తాలిబాన్లు అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ఏ దేశం కూడా వారి పాలనను గుర్తించని నేపథ్యంలో, రష్యా తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
తాలిబాన్లు నియమించిన కొత్త ఆఫ్ఘన్ రాయబారి గుల్ హసన్ హసన్ ను గుర్తిస్తున్నట్టు రష్యా ప్రకటించింది. గుల్ హసన్ నుంచి రష్యా ఉప విదేశాంగ మంత్రి ఆండ్రీ రుడెంకో అధికారిక పత్రాలను స్వీకరించారు. ఈ మేరకు రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో పాటు, మాస్కోలోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయంపై గత ప్రభుత్వ జెండాను తొలగించి, తాలిబాన్ల తెల్ల జెండాను ఎగురవేశారు.
ఈ గుర్తింపుతో ఇరు దేశాల మధ్య పలు రంగాల్లో నిర్మాణాత్మక ద్వైపాక్షిక సహకారం పెరుగుతుందని ఆశిస్తున్నట్లు రష్యా పేర్కొంది. ముఖ్యంగా వాణిజ్యం, ఇంధనం, రవాణా, వ్యవసాయ రంగాల్లో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. రష్యా నిర్ణయాన్ని తాలిబాన్ ప్రభుత్వం స్వాగతించింది. ఇది తమ ద్వైపాక్షిక సంబంధాల చరిత్రలో ఒక పెద్ద విజయమని తాలిబాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాకి అన్నారు.
2021 ఆగస్టులో తాలిబాన్లు కాబూల్ను ఆక్రమించుకున్నప్పటికీ, రష్యా మాత్రం తన రాయబార కార్యాలయాన్ని మూసివేయకుండా వారితో సంబంధాలు కొనసాగిస్తూ వచ్చింది. కాగా, మానవ హక్కుల విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలని ప్రపంచ దేశాలు తాలిబాన్లపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ కారణంగానే ఇప్పటివరకు ఏ దేశం కూడా వారి ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించేందుకు ముందుకు రాలేదు.
తాలిబాన్లు నియమించిన కొత్త ఆఫ్ఘన్ రాయబారి గుల్ హసన్ హసన్ ను గుర్తిస్తున్నట్టు రష్యా ప్రకటించింది. గుల్ హసన్ నుంచి రష్యా ఉప విదేశాంగ మంత్రి ఆండ్రీ రుడెంకో అధికారిక పత్రాలను స్వీకరించారు. ఈ మేరకు రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో పాటు, మాస్కోలోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయంపై గత ప్రభుత్వ జెండాను తొలగించి, తాలిబాన్ల తెల్ల జెండాను ఎగురవేశారు.
ఈ గుర్తింపుతో ఇరు దేశాల మధ్య పలు రంగాల్లో నిర్మాణాత్మక ద్వైపాక్షిక సహకారం పెరుగుతుందని ఆశిస్తున్నట్లు రష్యా పేర్కొంది. ముఖ్యంగా వాణిజ్యం, ఇంధనం, రవాణా, వ్యవసాయ రంగాల్లో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. రష్యా నిర్ణయాన్ని తాలిబాన్ ప్రభుత్వం స్వాగతించింది. ఇది తమ ద్వైపాక్షిక సంబంధాల చరిత్రలో ఒక పెద్ద విజయమని తాలిబాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాకి అన్నారు.
2021 ఆగస్టులో తాలిబాన్లు కాబూల్ను ఆక్రమించుకున్నప్పటికీ, రష్యా మాత్రం తన రాయబార కార్యాలయాన్ని మూసివేయకుండా వారితో సంబంధాలు కొనసాగిస్తూ వచ్చింది. కాగా, మానవ హక్కుల విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలని ప్రపంచ దేశాలు తాలిబాన్లపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ కారణంగానే ఇప్పటివరకు ఏ దేశం కూడా వారి ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించేందుకు ముందుకు రాలేదు.