Pakistan: బుద్ధి మార్చుకోని పాకిస్థాన్.. ఉగ్ర క్యాంపులకు పాక్ ప్రభుత్వం, ఐఎస్ఐ భారీగా నిధుల సాయం
- భారత్ దాడుల తర్వాత కూడా వైఖరి మార్చుకోని పాకిస్థాన్
- ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాలను తిరిగి నిర్మిస్తున్న వైనం
- నియంత్రణ రేఖ వద్ద దట్టమైన అడవుల్లో కొత్త క్యాంపుల ఏర్పాటు
- పాక్ ప్రభుత్వం, ఐఎస్ఐ ప్రత్యక్షంగా నిధులు సమకూరుస్తున్నట్లు వెల్లడి
- వైమానిక దాడులను ఎదుర్కొనేందుకు అధునాతన సాంకేతికత వినియోగం
భారత్ నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' ద్వారా భారీ నష్టాన్ని చవిచూసినప్పటికీ, పాకిస్థాన్ తన వైఖరిని మార్చుకోవడం లేదు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే తన పాత పంథానే కొనసాగిస్తోంది. ఇటీవల భారత సైన్యం ధ్వంసం చేసిన ఉగ్రవాద స్థావరాలను పాక్ తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు పాక్ ప్రభుత్వం, దాని గూఢచార సంస్థ ఐఎస్ఐ ఉగ్ర సంస్థలకు అండగా నిలుస్తున్నాయని స్పష్టం చేశాయి.
నిఘా వర్గాల సమాచారం ప్రకారం, పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్థాన్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పునర్నిర్మించేందుకు ఆ దేశ ప్రభుత్వం, ఐఎస్ఐ భారీగా నిధులు సమకూరుస్తున్నాయి. భవిష్యత్తులో వైమానిక దాడుల నుంచి సులభంగా తప్పించుకునేందుకు వీలుగా నియంత్రణ రేఖ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతాలను దీనికోసం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లుని, పుట్వాల్, తైపు పోస్ట్, జమిలా పోస్ట్, ఉమ్రాన్వాలి, చాప్రార్, ఫార్వర్డ్ కహుటా, చోటా చక్, జంగ్లోరా వంటి ప్రాంతాల్లో కొత్త శిబిరాల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి.
కేవలం శిబిరాలను పునరుద్ధరించడమే కాకుండా, భవిష్యత్తులో దాడుల నుంచి తప్పించుకునేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త శిబిరాల్లో థర్మల్ ఇమేజర్లు, ఫోలేజ్-పెనెట్రేటింగ్ రాడార్, ఉపగ్రహ నిఘాను ఏమార్చే అధునాతన సాంకేతిక పరికరాలను అమర్చుతున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగానే భారత్ ఇటీవల ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్థాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. ఈ దాడుల్లో జైషే మహమ్మద్, లష్కరే తొయిబాకు చెందిన పలు స్థావరాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి.
నిఘా వర్గాల సమాచారం ప్రకారం, పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్థాన్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పునర్నిర్మించేందుకు ఆ దేశ ప్రభుత్వం, ఐఎస్ఐ భారీగా నిధులు సమకూరుస్తున్నాయి. భవిష్యత్తులో వైమానిక దాడుల నుంచి సులభంగా తప్పించుకునేందుకు వీలుగా నియంత్రణ రేఖ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతాలను దీనికోసం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లుని, పుట్వాల్, తైపు పోస్ట్, జమిలా పోస్ట్, ఉమ్రాన్వాలి, చాప్రార్, ఫార్వర్డ్ కహుటా, చోటా చక్, జంగ్లోరా వంటి ప్రాంతాల్లో కొత్త శిబిరాల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి.
కేవలం శిబిరాలను పునరుద్ధరించడమే కాకుండా, భవిష్యత్తులో దాడుల నుంచి తప్పించుకునేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త శిబిరాల్లో థర్మల్ ఇమేజర్లు, ఫోలేజ్-పెనెట్రేటింగ్ రాడార్, ఉపగ్రహ నిఘాను ఏమార్చే అధునాతన సాంకేతిక పరికరాలను అమర్చుతున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగానే భారత్ ఇటీవల ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్థాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. ఈ దాడుల్లో జైషే మహమ్మద్, లష్కరే తొయిబాకు చెందిన పలు స్థావరాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి.