Rahul Bojja: మంజీరా డ్యామ్‌కు పగుళ్లు... స్పందించిన ప్రభుత్వం

Rahul Bojja Clarifies Manjeera Dam Crack Rumors
షార్ట్స్‌లో చూడండి
మంజీరా డ్యామ్‌కు పగుళ్లు వచ్చాయంటూ కొద్ది రోజులుగా జరుగుతోన్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా స్పష్టం చేశారు. ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు.

ఈ వదంతుల నేపథ్యంలో రాహుల్ బొజ్జా శుక్రవారం నేరుగా మంజీరా బ్యారేజీని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. డ్యామ్ నిర్మాణాన్ని, దాని పటిష్టతను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, డ్యామ్ భద్రతపై నిపుణులతో కూడిన సేఫ్టీ కమిటీ ఇచ్చిన నివేదికలో ఎక్కడా పగుళ్ల ప్రస్తావన లేదని తేల్చి చెప్పారు.

ప్రతి ఏటా వర్షాకాలానికి ముందు డ్యామ్‌కు చిన్నపాటి మరమ్మతులు చేపట్టడం సాధారణ ప్రక్రియ అని రాహుల్ బొజ్జా వివరించారు. ప్రస్తుతం జరుగుతున్నవి కూడా అలాంటి సాధారణ మరమ్మతులే తప్ప, డ్యామ్‌కు ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని ఆయన పేర్కొన్నారు.
Go Back to Shorts
Rahul Bojja
Manjeera Dam
Telangana Irrigation
Dam Repairs
Dam Safety
Rahul Bojja Visit

More Telugu News