Diageo: తొక్కిసలాటపై పెదవి విప్పని ఆర్సీబీ మాతృసంస్థ 'డయాజియో'

Diageo silent on Bangalore RCB victory rally stampede

  • ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో ఘోర తొక్కిసలాట, 11 మంది దుర్మరణం
  • 75 మందికి తీవ్ర గాయాలు, ఆసుపత్రులలో చికిత్స
  • మాతృ సంస్థ డియాజియో మౌనం వహించడంపై సర్వత్రా విమర్శలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్‌ను గెలుచుకున్న ఆనందం అభిమానులకు తీవ్ర విషాదంగా మారింది. జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పరిసరాల్లో ఏర్పాటు చేసిన విజయోత్సవ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట పెను విషాదానికి దారితీసింది. ఈ దుర్ఘటనలో 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, మరో 75 మంది తీవ్రంగా గాయపడ్డారు. వేడుకలు అదుపు తప్పి, గందరగోళంగా మారడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది.

ఈ ఘటన జరిగి రెండు రోజులు కావస్తున్నా, ఆర్సీబీ ఫ్రాంచైజీ మాతృ సంస్థ అయిన బ్రిటిష్ బహుళజాతి ఆల్కహాలిక్ కంపెనీ డయాజియో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఆర్సీబీ యాజమాన్యం ఒకటి రెండు ప్రకటనలు చేసినప్పటికీ, డయాజియో మాత్రం పూర్తి మౌనం వహిస్తోంది. బెంగళూరు తొక్కిసలాటపై స్పందన, కంపెనీ మౌనానికి కారణం, ఆర్సీబీ చేసిన ఏర్పాట్లపై సంతృప్తి, టైటిల్ గెలిచిన ఆనందానికి ఈ ఘటన మచ్చ తెచ్చిందా? అనే స్పష్టమైన ప్రశ్నలతో మీడియా సంస్థలు డయాజియోను సంప్రదించినప్పటికీ, వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు.

Diageo
Royal Challengers Bangalore
RCB
Bangalore stampede
Chinnaswamy Stadium
IPL
Indian Premier League
RCB title win
sports tragedy
Karnataka
  • Loading...

More Telugu News