Nandamuri Balakrishna: రీ రిలీజ్ లో నయా ట్రెండ్... కొత్త పాటతో మళ్లీ వస్తున్న 'లక్ష్మీ నరసింహ'
పాత సినిమాలను ఆధునిక సాంకేతికతతో మెరుగులుదిద్ది మళ్లీ విడుదల చేసే ట్రెండ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ‘పోకిరి’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘చెన్నకేశవరెడ్డి’, ‘జల్సా’ వంటి పలు విజయవంతమైన చిత్రాలు రీ రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మరోసారి సందడి చేశాయి. ఈ కోవలోనే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10) సందర్భంగా, ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రం ‘లక్ష్మీనరసింహా’ను జూన్ 8న ‘గోల్డెన్ టర్టెల్ ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. అయితే, ఈ రీ రిలీజ్లో ఒక సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టింది చిత్ర యూనిట్.
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2004లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. మణిశర్మ అందించిన సంగీతం, ముఖ్యంగా పాటలు విశేష ప్రజాదరణ పొందాయి. అయితే, అప్పట్లో చిత్రీకరణ పూర్తి చేసుకుని, హీరో క్యారెక్టర్ను హైలైట్ చేసేలా ఉన్న ఒక పాటను కొన్ని కారణాల వల్ల సినిమాలో ఉపయోగించలేదు. ఇప్పుడు, బాలకృష్ణ అభిమానులకు ఒక ప్రత్యేక కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఆ పక్కన పెట్టిన పాటను సినిమాకు జోడించాలని నిర్ణయించుకున్నారు.
కేవలం సౌండ్ లేకుండా ఉన్న పాత విజువల్స్ మాత్రమే లభ్యం కావడంతో, వాటికి అనుగుణంగా కొత్తగా పాటను రాయించారు. ప్రఖ్యాత గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించగా, యువ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు. స్వరాగ్ కీర్తన్ ఈ గీతాన్ని ఆలపించారు. ‘మందేసినోడు ఘనుడు’ అంటూ సాగే ఈ పాటను ప్రచార కార్యక్రమాల్లో భాగంగా గురువారం విడుదల చేశారు.
కాగా, సినిమా ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రదర్శించనున్నారు. ప్రేక్షకుల స్పందనను బట్టి ప్రదర్శనల సంఖ్యను మరింత పొడిగించే అవకాశాలున్నాయి.
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2004లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. మణిశర్మ అందించిన సంగీతం, ముఖ్యంగా పాటలు విశేష ప్రజాదరణ పొందాయి. అయితే, అప్పట్లో చిత్రీకరణ పూర్తి చేసుకుని, హీరో క్యారెక్టర్ను హైలైట్ చేసేలా ఉన్న ఒక పాటను కొన్ని కారణాల వల్ల సినిమాలో ఉపయోగించలేదు. ఇప్పుడు, బాలకృష్ణ అభిమానులకు ఒక ప్రత్యేక కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఆ పక్కన పెట్టిన పాటను సినిమాకు జోడించాలని నిర్ణయించుకున్నారు.
కేవలం సౌండ్ లేకుండా ఉన్న పాత విజువల్స్ మాత్రమే లభ్యం కావడంతో, వాటికి అనుగుణంగా కొత్తగా పాటను రాయించారు. ప్రఖ్యాత గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించగా, యువ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు. స్వరాగ్ కీర్తన్ ఈ గీతాన్ని ఆలపించారు. ‘మందేసినోడు ఘనుడు’ అంటూ సాగే ఈ పాటను ప్రచార కార్యక్రమాల్లో భాగంగా గురువారం విడుదల చేశారు.
కాగా, సినిమా ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రదర్శించనున్నారు. ప్రేక్షకుల స్పందనను బట్టి ప్రదర్శనల సంఖ్యను మరింత పొడిగించే అవకాశాలున్నాయి.