ఆల్ టైమ్ రికార్డ్... హైదరాబాద్లో రూ.1 లక్ష దాటిన బంగారం ధర
- హైదరాబాద్లో రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు
- మధ్యాహ్నం 12 గంటలకు రూ.1,00,110కి చేరిన తులం బంగారం
- ఏప్రిల్ 22 నాటి రికార్డును అధిగమించిన పసిడి
ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,015 వద్ద గరిష్ఠ స్థాయిని తాకింది. ఇప్పుడు ఆ రికార్డును కూడా అధిగమించి పసిడి ధర కొత్త శిఖరాలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం, డాలర్తో రూపాయి మారకం విలువలో చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, సరఫరా-డిమాండ్ మధ్య ఉన్న వ్యత్యాసం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితులు వంటి అంశాలు బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం కొనుగోళ్లు పెరిగాయి. అంతేకాకుండా, చాలామంది బంగారాన్ని దీర్ఘకాలిక సురక్షితమైన పెట్టుబడిగా భావించడం కూడా అధిక కొనుగోళ్లకు కారణమైంది.