ఐపీఎల్ క్వాలిఫయర్-2... ఆగని వాన... మ్యాచ్ రద్దయితే పంజాబ్ కింగ్స్ ఫైనల్ కు!

  • ముంబై, పంజాబ్ మధ్య ఐపీఎల్ క్వాలిఫయర్ 2 మ్యాచ్‌కు వర్షం అడ్డంకి
  • అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ అనంతరం వర్షం
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
  • ఈ మ్యాచ్ విజేత ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢీ
  • వర్షంతో మ్యాచ్ రద్దయితే పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న పంజాబ్ ఫైనల్‌కు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగాల్సిన కీలకమైన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. టాస్ వేసిన కొద్దిసేపటికే వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్‌ నిర్వహణకు అంతరాయం ఏర్పడింది. నేటి మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు, ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అమీతుమీ తేల్చుకోనుంది. అంతకుముందు, టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. 

మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏమిటి?

అహ్మదాబాద్‌లో సాధారణంగా సాయంత్రం వేళల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, టాస్ గెలిచిన జట్లు తరచుగా ఫీల్డింగ్ ఎంచుకోవడానికి మొగ్గుచూపుతాయి. అనూహ్య వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, మ్యాచ్‌లను పూర్తి చేయడానికి బీసీసీఐ ఇప్పటికే ఉన్న గంట సమయానికి అదనంగా మరో 120 నిమిషాల సమయాన్ని కేటాయించింది. ఇవాళ  వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం ఆలస్యం అయింది.

ఒకవేళ నిర్దేశిత సమయంలో కూడా మ్యాచ్ పూర్తి కాకపోతే, పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో నిలిచిన జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఈ లెక్కన చూస్తే ముంబై ఇండియన్స్ (4వ స్థానం) కంటే పంజాబ్ కింగ్స్ (1వ స్థానం) మెరుగైన స్థితిలో ఉంది. పంజాబ్ ఖాతాలో 19 పాయింట్లు ఉండగా, ముంబై ఇండియన్స్ ఖాతాలో 16 పాయింట్లే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, మ్యాచ్ పూర్తిగా రద్దయితే పంజాబ్ ఫైనల్‌కు చేరుకుంటుంది.


More Telugu News