ప్రభుత్వాధికారి ఇంట్లో నోట్ల కట్టలు.. విజిలెన్స్కు చిక్కిన భారీ అవినీతి తిమింగలం
- రూ. 2కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు
- ఒడిశాలోని అంగుల్, భువనేశ్వర్, పిపిలిలోని ఏడు ప్రదేశాలలో ఏకకాలంలో దాడులు
- చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న బైకుంత నాథ్ సారంగి
- ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో సోదాలు
అయితే, విజిలెన్స్ అధికారులు వచ్చేసరికి సారంగి తన ఫ్లాట్ కిటికీలోంచి బయటకు విసిరి నగదు కట్టలను పారవేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని ఆ నోట్ల కట్టలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంగుల్లోని అతని నివాసంలో రూ.1.1 కోట్లు, భువనేశ్వర్ ఫ్లాట్లో మరో కోటి రూపాయలు దొరికాయి.
సారంగి తన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగాయి. ఎనిమిది మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారులు, 12 మంది ఇన్స్పెక్టర్లు, ఆరుగురు అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్లు సహా 26 మంది పోలీసు అధికారుల బృందంతో పాటు ఇతర సహాయక సిబ్బంది ఈ సోదాలు నిర్వహించారు.