నేడు రాజారెడ్డి శతజయంతి... సమాధి వద్ద నివాళి కార్యక్రమానికి దూరంగా జగన్
- పులివెందులలోని రాజారెడ్డి ఘాట్ వద్ద కుటుంబ సభ్యుల నివాళి
- ప్రత్యేక ప్రార్థనలు చేసిన విజయమ్మ, షర్మిల
- తాత శతజయంతిని విజయవాడలో జరుపుకున్న జగన్
మరోవైపు తన తాత రాజారెడ్డి ఘాట్ వద్ద నివాళి కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ దూరంగా ఉన్నారు. ఈరోజు ఆయన తన తాత శతజయంతిని విజయవాడలోని నిర్మల శిశు భవన్ లో తన భార్య భారతితో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారితో పాటు జగన్ మేనత్త విమలారెడ్డి కూడా ఉన్నారు. పిల్లలతో కలిసి వీరు కేక్ కట్ చేశారు.
