India Pakistan Border: ఉద్రిక్తతల మధ్య సరిహద్దుల్లో మాక్‌ డ్రిల్‌: మే 29న ప్రభుత్వ సన్నాహాలు

India Pakistan Border Mock Drill Planned for May 29

  • పాక్‌ సరిహద్దు జిల్లాల్లో మే 29న మాక్‌ డ్రిల్‌కు భారత ప్రభుత్వం సన్నాహాలు
  • గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్ము కశ్మీర్‌లలో ప్రజలకు అవగాహన కార్యక్రమం
  • అత్యవసర పరిస్థితుల్లో స్పందించే తీరుపై స్థానికులకు శిక్షణ
  • పహల్గామ్ దాడి తదనంతర ఉద్రిక్తతల నేపథ్యంలో పౌర సన్నద్ధతకు ప్రాధాన్యం

పాకిస్థాన్‌తో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాల్లోని జిల్లాల్లో ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై అవగాహన కల్పించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా మే 29వ తేదీన ఒక మాక్‌ డ్రిల్‌ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమం ద్వారా సరిహద్దు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వారిని సన్నద్ధం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది.

పంజాబ్, గుజరాత్, రాజస్థాన్‌లతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ము కశ్మీర్‌లోని ఎంపిక చేసిన సరిహద్దు జిల్లాల్లో ఈ మాక్‌ డ్రిల్‌ను చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూచనలు జారీ చేసినట్లు సమాచారం. ఇటీవల పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల దృష్ట్యా పౌరుల సంసిద్ధతను పెంచడం అత్యవసరమని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, పౌర సన్నద్ధతను సమీక్షించేందుకు 'ఆపరేషన్‌ అభ్యాస్‌' పేరిట మే 7వ తేదీన దేశవ్యాప్తంగా ఒక మాక్‌ డ్రిల్‌ను నిర్వహించారు. అదే రోజున, భారత సైనిక దళాలు 'ఆపరేషన్‌ సిందూర్‌'ను కూడా చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్‌ భూభాగంపై, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలు, సైనిక స్థావరాలపై భారత దళాలు దాడులు చేసి వాటిని ధ్వంసం చేశాయి.

India Pakistan Border
Border Mock Drill
Pakistan
Jammu Kashmir
  • Loading...

More Telugu News