క‌డ‌ప జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం... అక్కడికక్కడే ఐదుగురు మృతి

Five killed in horrific road accident in Kadapa district
ఏపీలోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. జిల్లాలోని సి.కె.దిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్‌ వద్ద లారీ, కారు ఢీకొన్నాయి. గువ్వలచెరువు ఘాట్‌ మలుపు వద్ద కారుపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. 

మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. రాయ‌చోటి నుంచి క‌డ‌ప‌కు కారులో వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్ర‌మాద‌స్థలికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుప‌త్రికి తరలించారు.  
Go Back to Shorts
Road Accident
Kadapa accident
Andhra Pradesh accident
Guvvalacheruvu ghat
CK Dinne
lorry car collision
Kadapa district
Rayachoti
fatal accident

More Telugu News