రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..?
- ఆపరేషన్ సిందూర్ పై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
- సైనిక ఘర్షణలో మన సైన్యానికి వాటిల్లిన నష్టం ఎంతో చెప్పాలని నిలదీత
- ప్రభుత్వాన్ని వివరణ కోరడం తప్పెలా అవుతుందన్న మహారాష్ట్ర నేత
నాగ్పుర్లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాక్ లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తర్వాత చోటుచేసుకున్న సైనిక ఘర్షణలో పాక్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను నేలకూల్చినట్లు వివరించింది. అయితే, మనవైపు నుంచి జరిగిన నష్టంపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. పాక్ ప్రభుత్వం మన యుద్ధ విమానాలను కూల్చివేశామని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో సైనిక ఘర్షణ సందర్భంగా మనవైపు చోటుచేసుకున్న నష్టం గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పెలా అవుతుంది?’’ అంటూ విజయ్ వాడిట్టివార్ ప్రశ్నించారు.